ఒట్టావా: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదుల దుష్చర్యలు ఆగడం లేదు. తాజాగా టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో వారు 8 లక్షల మంది హిందువులను దేశం నుంచి వెనక్కి పంపించాలంటూ ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఖలిస్థానీలు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ చిత్రాలను అభ్యంతరకరంగా ఓ బోనులో పెట్టి ప్రదర్శించారు. ఇటీవల ఓ గురుద్వారా మరియు ఓ హిందూ మందిరంలో జరిగిన విధ్వంస ఘటనల తర్వాత ఈ ప్రదర్శన జరగడం గమనార్హం.ఈ ఘటనపై కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడు షవన్ బిండా స్పందించారు. ఆయన ఈ కార్యక్రమం ఖలిస్తానీ గ్రూపు హిందువులపై కలిగించిన ద్వేషాన్ని ప్రతిబింబిస్తోందని, ఇది భారత ప్రభుత్వంపై ఆందోళన కాదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆయన గతంలో జరిగిన కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేశారు.

Khalistan : కెనడా నుంచి హిందువులను పంపించేయండి
ఇక కెనడాకు చెందిన విలేకరి డానియల్ బోర్డమన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఖలిస్తానీలు హిందువులపై చేస్తున్న వ్యతిరేకతను పబ్లిక్గా బయటపెడుతూ, వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఖలిస్తానీలపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని మార్క్ కార్నీకి, మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోకి తేడా ఉందా? అని ప్రశ్నించారు.ఖలిస్తానీలు కేంద్ర మంత్రులను బెదరించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేయడానికి ఖలిస్తానీలు కుట్రలు పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో లీకైన కొన్ని స్క్రీన్షాట్లు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. అంతేగాక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా ఖలిస్తానీ సంస్థ వారిస్ పంజాబ్ డీ సంస్థ నేతలు రక్ష పెంచుకున్నట్లు సమాచారం ఉంది.
Read More : NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు