हिन्दी | Epaper
బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

Tejaswini Y

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మత విద్వేషంతో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దైవదూషణ చేశాడన్న ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అల్లరిమూక కిరాతకంగా హతమార్చింది. అనంతరం అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించిన ఘటన మైమెన్‌సింగ్ జిల్లా భలుకా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం నెలకొంది.

Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య

దీపు చంద్ర దాస్ హత్య కేసు

స్థానికంగా గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు చంద్ర దాస్‌(Deepu Chandra Das)పై గురువారం రాత్రి ప్రవక్త మహమ్మద్‌ను అవమానించాడని ఆరోపణలు వ్యాపించాయి. ఈ వార్తలు చెలరేగిన వెంటనే వందలాది మందితో కూడిన గుంపు అతడిని చుట్టుముట్టి కర్రలు, చేతులతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఎలాంటి పోలీసు జోక్యం లేకుండానే అతడిని హత్య చేసి, మృతదేహానికి నిప్పు పెట్టినట్లు పోలీసులు ధృవీకరించారు.

ఈ ఘటనపై భారత్‌లో రాజకీయ స్పందనలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బీజేపీ(BJP) పశ్చిమ బెంగాల్ శాఖ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మైనారిటీల భద్రత బంగ్లాదేశ్‌లో పూర్తిగా క్షీణించిందని వ్యాఖ్యానించింది. పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తీవ్రవాద శక్తులను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం ఇలాంటి దారుణాలకు దారితీస్తోందని విమర్శించారు.

ఇటీవల బంగ్లాదేశ్‌(Bangladesh)లో రాజకీయ అశాంతి పెరుగుతున్న నేపథ్యంలో మైనారిటీ వర్గాలపై దాడులు అధికమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే హిందూ, క్రిస్టియన్ మైనారిటీల భద్రతపై అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870