భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లైన సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి(Satwiksairaj-Chirag Shetty) జోడి మూడు నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టింది. వారు తమ పునరాగమనాన్ని విజయంతో ఆరంభించారు. సింగపూర్ ఓపెన్ సూపర్(Singapore Open Super) 750 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-16, 21-13తో చూంగ్ హాన్-మహ్మద్ హైకల్పై అలవోక విజయం సాధించింది.

బాధించడంతో
మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే సాత్విక్-చిరాగ్ దూకుడుగా ఆడారు.40 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్(Prequarters)కు అర్హత సాధించింది. సాత్విక్-చిరాగ్ మెరిసినా మిగిలిన షట్లర్లకు నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ షట్లర్ లక్ష్యసేన్ 21-15, 17-21, 5-13తో లిన్చున్యి (చైనీస్ తైఫీ) చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్(Third game)లో లక్ష్యసేన్కు వెన్ను నొప్పి బాధించడంతో అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దీంతో ఆ గేమ్ పూర్తికాకుండానే లిన్ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ మొదటి రౌండ్కే ఇంటిబాట పట్టగా మహిళల డబుల్స్ ద్వయం వైష్ణవి-అలిషా సైతం నిరాశపరిచారు.
Read Also: Boxing Tournament: బాక్సింగ్ టోర్నమెంట్ సెమిస్ లో తమన్నా, ప్రియ