हिन्दी | Epaper

Athletics Championships: అథ్లెటిక్స్‌ లో భారత్ పసిడి పథకాలు

Anusha
Athletics Championships: అథ్లెటిక్స్‌ లో భారత్ పసిడి పథకాలు

భారత అథ్లెట్లు, దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ(Jyoti Yarraji), అవినాశ్‌ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్‌లో భారత్‌ స్వర్ణ పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్‌ రేసును జ్యోతి 12.96 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ట్రాక్‌పై జ్యోతి అగ్రస్థానంలో నిలిచింది. యుమి తనకా(జపాన్‌), వు యన్ని(చైనా) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. జ్యోతి విజయానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం(Visakhapatnam)కి చెందిన జ్యోతి గత కొన్నేళ్లుగా తన ప్రతిభను నిలబెట్టుకుంటూ భారత అథ్లెటిక్స్‌లో ఓ కీలక స్థానాన్ని సంపాదించుకుంది.

అభినందనలు

ఇదే వేళ, పురుషుల స్టీపుల్‌చేస్‌లో భారత స్టార్ అథ్లెట్ అవినాశ్‌ సాబ్లే కూడా మెరిశాడు.అవినాశ్‌ ముకుంద్‌ సాబ్లె(Avinash Mukund Sable) 8:20:92సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం దక్కించుకున్నాడు. మహిళల 4X400 మీటర్ల రిలే రేసులో జిస్నా మాథ్యూస్‌, రూపాల్‌ చౌదరి, కుంజ రజిత, శుభా వెంకటేశన్‌(Subha Venkatesan)తో కూడిన భారత జట్టు రేసును 3:34:18 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు 10వ స్వర్ణం కాగా, లీగ్‌లో ఇప్పటి వరకు భారత్‌ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో దూసుకెళుతున్నది.

Read Also: Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్‌,చిరాగ్‌ జోడీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870