నేడు ప్రపంచంలో బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈఆధిపత్యంలో అమెరికా (America) సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతకాలంలో సామ్రాజ్యవాద శక్తికింద ఉన్న అనేక ప్రాం తాలు స్వయం పాలన పొందాయి. అమెరికా (America)దాని దిగ్గజ సంస్థల ద్వారా అతిపెద్ద పారిశ్రామిక శక్తిగా అవతరించింది. ఈకార్పొరేట్లు తమ అనుబంధ సంస్థల ద్వారా వెనుకబడిన దేశాలకు మూలధనం ఎగుమతి చేయడం ప్రారంభించాయి. అమెరికా ఇప్పుడు దాని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డిఐ) ద్వారా మూలధనాన్ని ఎగుమతిచేసే అత్యంత ఆధిపత్య దేశంగా మారింది. బహుళజాతి సంస్థలకు లాభాలు పెంచు కునే ఉద్దేశమే ప్రధానమైంది. లాభాలను తమదేశాలకు తర లించుకుపోవడం, రాయిల్టీ చెల్లింపులు, కమీషన్లు సాంకేతిక కన్సస్టెన్సీ రుసుముల ద్వారా బహుళజాతి సంస్థల దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పుడు బహుళజాతి సంస్థల ఆర్థికదోపిడీని నయా వలసవాదం లేదా నయా సామ్రాజ్యవాదంగా వెనుకబడిన దేశాలకు విస్తరింపచేశారు. తమశాఖల అనుబంధ సంస్థల ద్వారా వివిధ దేశాల పారిశ్రామిక మార్కెటింగ్ ప్రాంతాల్లో తమ కార్యక్రమాలను విస్తరించుకుంటాయి. అనేకరంగాల్లో పెద్దఎత్తున ఉత్పత్తులు చేస్తూ అనేక దేశాలపై వ్యాపార వ్యూహాన్ని విస్తరిస్తాయి. 1990 ప్రారంభంలో 37 వేల బహుళజాతి కంపెనీలు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థను ఆక్రమించాయి. ఈకంపెనీలు భారీమొత్తంలో ఆర్థికవనరులు కలిగి ఉన్నాయి. 200వందల అగ్రశ్రేణి బహుళజాతి కంపె నీలు (ఎంఎన్సి ) సంపాదించిన ఆదాయం 1982లో 3,046 బిలియన్ల డాలర్ల నుండి 1992నాటికి 5,862 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈకాలంలో ప్రపంచ జీడీపీలో బహుళ జాతి సంస్థల వాటా 24.2 శాతం నుండి 26.8శాతాని కిచేరింది. 1992లో బహుళజాతి సంస్థల మొత్తం లాభాలు 73.8 బిలియన్డాలర్లు. ఇందులో అతిపెద్ద 10బహుళజాతి సంస్థల వాటా 38.8 బిలియన్డాలర్లు. (అంటే 47 శాతం) నేడు ప్రపంచంలో బహుళజాతి సంస్థల సంఖ్య 60 వేలుదాటింది. స్వాతంత్య్రం వచ్చినదగ్గర నుంచి ప్రపంచంలోని వివిధదేశాల నుంచి ముఖ్యంగా అమెరికానుంచి విదేశీ సహ కారాల రూపంలో బహుళజాతి సంస్థలు భారతదేశంలోకి ప్రవేశించాయి.దేశ పాలకులు వాటిని ఆహ్వానించారు.
Read Also : http://Trade Deal: ట్రంప్ క్లీన్ బోల్డ్ .. భారత్ పంతమే నెగ్గింది!

ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం
భారత ఆర్థిక వ్యవస్థలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించడం, దేశ ఆర్థికవ్యవస్థపై దాని దుష్ప్రభావం వెడల భిన్నా భిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాలకుల విధానాల వల్ల నేడు భారత ఆర్థికవ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రాబ ల్యం ఎక్కువగా ఉంది. 1970లో కూడా అత్యున్నత స్థానం లో ఉన్నకంపెనీల ఆస్తులలో దాదాపు 37.7 శాతం బహుళ జాతి సంస్థల నియంత్రణలో ఉంది. పారిశ్రామిక లైసెన్సింగ్ విధాన విచారణ కమిటీ అంచనాల ప్రకారం 1966లో భారత దేశంలో 10కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులతో దాదాపు 112 బహుళజాతి సంస్థలు పనిచేశాయి. ఈకంపెనీల్లో 48 కంపెనీలు విదేశీ శాఖల లేదా విదేశీ కంపెనీల భారతీయ అనుబంధసంస్థలు 14 ఇతర కంపెనీలు భారీ రుణాలు, 54శాతంగా ఉంది. మిగి లినఇతర కంపెనీలు కూడా విదేశీ ఆధిపత్యంలోనే ఉన్నాయి. 1960ల మధ్యకాలంలో పాశ్చాత్య విదేశీ మూలధనం దేశం లోని పెద్దవ్యాపారాలపై ఆధిపత్యం కలిగిఉంది. భారత దేశంలోని బహుళజాతి సంస్థల ముఖ్యమైన లక్షణం ఏమి ఉంటే, అవిభారత ఆర్థికవ్యవస్థ వనరుల్లోనే ఎక్కువ భాగాన్ని సేకరిస్తున్నాయి. సుదీపౌదరి 1956 నుంచి 1975 సంవత్స రం వరకు 50 అతిపెద్ద విదేశీ అనుబంధ సంస్థల నమూ నాలను తీసుకుని బహుళ జాతి ఆర్థిక వనరులపై అధ్య యనం చేశాడు. ఈకంపెనీల మొత్తం ఆర్థిక వనరుల్లో 5.4 శాతం మాత్రమే విదేశీవనరుల ద్వారా అందించబడిందని మిగిలిన 94.6 శాతం భారతదేశవనరుల ద్వారా అందించ బడిందని ఆయన అధ్యయనం వెల్లడించింది. బహుళజాతి కార్పొరేట్ సంస్థలు భారత దేశం నుంచి పెద్ద ఎత్తున లాభాలు తరలించుకుపోతున్నాయి. 2020-21లో 2లక్షల, 50 వేలకోట్ల రూపాయలుగా ఉన్న కార్పొరేట్ లాభాలు 2024-25 లో 7 లక్షల, వెయ్యికోట్ల రూపాయలకు చేరాయి. ఈ విషయాన్ని రిజర్వుబ్యాంకు ఆఫ్ఇండియా నివేదిక వెల్లడించింది.

ఆర్థిక అసమానతల
దేశంలో సంవత్సర కాలంలో కార్పొ రేట్ సంస్థల పన్నుల కంటే వాటి యజమానులు వ్యక్తిగత పన్నులు మించిపోయాయి. 2020-21 నుంచి 2025 మధ్య కాలంలో బహుళజాతి సంస్థల లాభాలు మూడిం తలు పెరిగినట్లు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దేశంలో ఆర్థిక అసమానతల ముఖచిత్రాన్ని కార్పొరేట్ల లాభాలు బహిరంగ పరుస్తున్నాయి. దేశం మొత్తం జనాభాలోని 10శాతం మంది వద్ద 77 శాతం సంపద పోగుబడి ఉంది. ఒక్సాఫామ్ నివేదిక ప్రకారం 2017లో దేశసంపదలో 73 శాతం సంపద1 శాతం సంపన్నులకు చేరింది. కటిక పేద వారైన 67 కోట్ల ప్రజల్లో సగం మంది ఆస్తిలో కేవలం 1శాతం పెరుగుదల మాత్రమే ఉంది. కార్పొరేట్ల సంపద పెరుగుదలతోపాటు ప్రభుత్వం కూడా పెద్దఎత్తున రాయితీలతోపాటు, రుణాలను రద్దు చేస్తున్నది. రిజర్వుబ్యాంక్ ఇండియా ఇచ్చిన డేటా ప్రకారం 2014- 2024 వరకు భారతీయ బ్యాంకులు మొండి బకాయిల పేరుతో 16,61,310 కోట్ల కార్పొరేట్ల రుణాలు రద్దుచేశాయి. ఇవికాక 2024-25 ఆర్థికసంవత్సరంలో 91,260 కోట్ల రూపాయల బకాయిలు రద్దుచేశాయి. స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి దేశ పాలకులు సామ్రాజ్య వాద ప్రయోజనాలు కాపాడుతూ, బహుళ జాతి సంస్థల ప్రవేశానికి గేట్లు బార్ల తెరిచారు. ఫలితంగా బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం, వాటి దోపిడీ, సంపద తరలింపు దేశం నుంచి పెద్దఎత్తున కొనసాగుతున్నది. కేంద్రప్రభుత్వం కూడా వాటి ప్రయోజనాలకు అను గుణమైన విధానాలు అమలు జరుపుతున్నది. బహుళజాతి సంస్థల దోపిడీకి, దేశసంపద తరలింపుకి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతకుజలు ఉద్యమించాలి.
-బొల్లిముంతసాంబశివరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: