Abdul Majid: భారత్లో ఇరాన్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ ఆ దేశ భవిష్యత్తు నాయకత్వంపై కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ మరో వారంలోపు పూర్తి కానుందని ఆయన వెల్లడించారు. సాధారణంగా ఈ ఎంపికను 88 మంది సభ్యులతో కూడిన అత్యున్నత నిపుణుల బృందం (Assembly of Experts) చేపడుతుందని, అయితే అమెరికా మరియు ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడుల కారణంగా ఈ సమావేశం నిర్వహించడం ఆలస్యమైందని ఆయన వివరించారు.
Read Also:Iran Israel War: ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు
అమెరికా హెచ్చరికలపై మాజిద్ ఘాటుగా స్పందించారు. ఒకవేళ అమెరికా కొత్తగా ఎన్నికైన నాయకుడిని కూడా అంతమొందించాలని చూస్తే, వెంటనే మరొకరిని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. “మీరు ఇరాన్లోని 9 కోట్ల మంది ప్రజలను చంపలేరు.. అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు” అంటూ ఇరాన్ మొండి పట్టుదలను చాటిచెప్పారు. నాయకత్వ మార్పులతో తమ దేశ పోరాట పటిమ తగ్గదని ఆయన పునరుద్ఘాటించారు.
యుద్ధ గమనంపై స్పందిస్తూ, ఇరాన్ ఒక సుదీర్ఘ పోరాటానికి సిద్ధమైందని అబ్దుల్ మాజిద్ తెలిపారు. అవసరమైతే మరో రెండేళ్ల పాటు యుద్ధం కొనసాగించేందుకు తమ దగ్గర తగిన వనరులు మరియు సైనిక సామర్థ్యం ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే అమెరికా తన దూకుడును తగ్గించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: