టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున ఖర్చు తగ్గింపు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వేగంగా అమలు చేయడం. కానీ ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం ప్రత్యేకంగా కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రొఫెషనల్ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది.

టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

40కి పైగా అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్
ఇండియాలో ప్రముఖ ఐటీ కంపెనీగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ 40కి పైగా అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్ నియమించుకోనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్ నెట్, ఆండ్రాయిడ్ iOS డెవలప్‌మెంట్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ వంటి రంగాలలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికీ మంచి ప్యాకేజితో ఉద్యోగ అవకాశాలు అందించనున్నట్లు వెల్లడించింది.
ఇన్ఫోసిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
అదేవిధంగా గత సంవత్సరం ఇన్ఫోసిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొంతమంది ప్రొఫెషనల్స్’ని సెలక్ట్ చేసింది. ఆ సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొనడానికి బెంగళూరు, చెన్నై ఇంకా హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ ఆఫీసులకు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం ఇంటర్నల్ కమ్యూనికేషన్ ద్వారా అందించినట్లు నివేదించింది. ఇంటర్వ్యూకి ఎక్కడికి రావాలో సలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇన్ఫోసిస్ వారికే ఇచ్చింది. మూడు సంవత్సరాల క్రితం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇన్ఫోసిస్ బెంగళూరు ఆఫీస్ నుండి వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొఫెషనల్స్’ని రిక్రూట్ చేసుకుంది.
20 వేల మంది ఫ్రెషర్ల నియామకం
అంతేకాదు ఈ ఏడాది అంటే 2025లో 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనితో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని కూడా నియమించుకోవడానికి ఇలాంటి ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ 3.23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల ప్లేస్మెంట్లను భర్తీ చేయడానికి అలాగే కొత్త ప్రాజెక్టులకు ఫ్రెషర్లను సెలెక్ట్ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇది కాకుండా ఇన్ఫోసిస్ గత నెలలోనే 600 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్ లెటర్లను జారీ చేసింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని ఇన్ఫోసిస్ 600 మంది యువతకు ఉపాధి కల్పించింది.
గత 9 నెలల్లో ఇన్ఫోసిస్‌లో ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వబోమని కూడా సమాచారం. గత నెలలో ఇన్ఫోసిస్ 300 మందికి పైగా ఎంట్రీ లెవల్ ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడంతో వివాదంలో చిక్కుకుంది. ఇందుకు ఫ్రెషర్లను నియమించుకుని వారికి శిక్షణ ఇచ్చి కొన్ని ఎలిజాబిలిటీ టెస్టులను కూడా నిర్వహించింది.

Related Posts
Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు
Honey Trap :హనీ ట్రాప్ లో మరో ఉద్యోగి వరుస ఘటనలతో తలపట్టుకున్న నిఘా వర్గాలు

ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆయుధ కర్మాగారానికి చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకుంది. ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఛార్జ్‌మెన్‌గా పనిచేస్తున్నరవీంద్ర కుమార్‌ను పాకిస్తాన్‌కు రహస్య Read more

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: పబ్లిక్ ఆఫీసులు, స్కూళ్లు మూసివేత, బ్యాంకులు అందుబాటులో
elections

మహారాష్ట్రలో ఈరోజు (నవంబర్ 20) జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులను తెచ్చే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజలు తమ ఓటు హక్కును Read more

ప్రపంచ కుబేరుల జాబితా.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్‌ బర్గ్‌
Zuckerberg passes Bezos to become worlds second richest person

Zuckerberg passes Bezos to become world’s second-richest person న్యూయార్క్‌ : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే Read more

వసంత పంచమి నాడు కుంభ మేళాలో హై అలర్ట్‌
maha kumbamela

మహాకుంభమేళా సందర్భంగా వసంత పంచమి నాడు జరగనున్న అమృత స్నానం నేపథ్యంలో, ప్రయాగరాజ్ డివిజన్‌లోని అన్ని వైద్య బృందాలను హై అలర్ట్‌లో ఉంచారు. తక్షణ సహాయం అందించడానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *