భారత్ (India) మలేరియాను రెక్కలుగొట్టే వ్యాధిగా కాకుండా, పూర్తిగా నిర్మూలించాల్సిన లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న మలేరియా వ్యాక్సిన్ (Malaria vaccine) తో ఈ లక్ష్యం చేరువలోకి వచ్చింది.భారత వైద్య పరిశోధన మండలి (ICMR), భువనేశ్వర్లోని RMRCBB, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR), బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (DBT-NII) కలిసి ‘అడ్ఫాల్సివాక్స్’ అనే వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాయి.

ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ లక్ష్యంగా వ్యాక్సిన్
ఈ వ్యాక్సిన్ మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే పరాన్నజీవిని రెండు కీలక దశల్లో లక్ష్యంగా చేసుకుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయకుండా పరాన్నజీవిని ఎదుర్కొనేలా పనిచేస్తుంది.ప్రీ-క్లినికల్ స్టడీల్లో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపింది. ఇతర సాంప్రదాయ వ్యాక్సిన్ల కంటే ఇది ఎక్కువకాల రోగనిరోధకతను అందిస్తుందని పరిశోధకులు తెలిపారు.
9 నెలల వరకు ఉష్ణోగ్రతలో స్థిరంగా ఉంటుంది
ఈ వ్యాక్సిన్ గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలలపాటు నిల్వ ఉండగలదు. దీని తయారీలో లాక్టోకాకస్ లాక్టిస్ అనే సురక్షితమైన బ్యాక్టీరియాను వాడారు.ఈ వ్యాక్సిన్ వ్యాధి ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా, వ్యాధి వ్యాప్తిని కూడా నియంత్రించగలదు. దీని ద్వారా సమాజం మొత్తానికి లాభం చేకూరనుంది.
తయారీదారులకు టెక్నాలజీ లైసెన్సింగ్
ICMR ఈ టెక్నాలజీని తయారీదారులకు నాన్-ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ద్వారా అందించనుంది. దీని ద్వారా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు దారితీస్తుంది.ఈ వ్యాక్సిన్ పూర్తి స్వదేశీగా తయారవుతోంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాక, మలేరియా నిర్మూలనలో కీలక మార్గదర్శకంగా నిలవనుంది.ఈ వ్యాక్సిన్ ఇంకా క్లినికల్ లేదా వాణిజ్య వినియోగానికి అందుబాటులో లేదు. ఇది ప్రస్తుతం పరిశోధనలో కొనసాగుతోంది.
Read Also : ISKCON : ఇస్కాన్ ప్రార్థనా మందిరంలో కేఎఫ్సీ చికెన్ తిన్న వ్యక్తి