हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Passport : పాకిస్తానీయుడికి భారత పాస్‌పోర్ట్

Sudheer
Passport : పాకిస్తానీయుడికి భారత పాస్‌పోర్ట్

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి కారణమని నిర్ధారణ కావడంతో, దేశ భద్రత పరంగా కేబినెట్ కమిటీ చురుకైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తానీయులను మే 1వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డెడ్‌లైన్ విధించింది. దీనితో అట్టారీ-వాఘా చెక్‌పోస్ట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అధికారిక డాక్యుమెంట్లు ఉన్న పాకిస్తానీయులు కూడా ఈ గడువులోపు భారత్‌ను విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుతో సహా పౌరసత్వం

ఇలాంటి సంక్లిష్ట సమయంలో బెంగళూరులో నివసిస్తున్న ఓ పాకిస్తానీయుడు భారత పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుతో సహా పౌరసత్వం కలిగి ఉన్నట్లు పేర్కొంటూ దేశ బహిష్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ వీటిని మంజూరు చేయడం వల్లే తమను భారత పౌరులుగా గుర్తించారని వాదించాడు. ఈ నేపథ్యంలో తనను బలవంతంగా దేశం నుంచి పంపించే చర్యలను నిలిపివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశాడు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తి

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తాత్కాలికంగా అతని దేశ బహిష్కరణపై స్టే మంజూరు చేసింది. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్‌ను పరిశీలించి, అతని కుటుంబ సభ్యుల పత్రాలను ధృవీకరించాలని సూచించింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తి ఉంటే జమ్మూ కాశ్మీర్ లేదా లడఖ్ హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా ఈ బెంచ్ స్పష్టం చేసింది.

Read Also : Bharat : ఘనంగా కొనసాగుతున్న వేవ్స్ సమ్మిట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870