మయన్మార్‌కు రోబోటిక్స్‌ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపిన భారత్‌

India: మయన్మార్‌కు రోబోటిక్స్‌ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపిన భారత్‌

మయన్మార్‌కు భారత్‌ ఫుల్ భరోసా! రోబోటిక్ మ్యూల్స్‌, నానో డ్రోన్స్‌తో రెస్క్యూ ఆపరేషన్‌
ఇటీవల తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాండలే, నేపిడాలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా శోధిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే “ఆపరేషన్‌ బ్రహ్మను” ప్రారంభించిన భారత్‌, తాజాగా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం నాలుగు కాళ్లుండే రోబోటిక్స్‌ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపింది. వీటి సాయంతో శిథిలాల కింద వెతుకుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటుకి వీటిని పంపి గాలిస్తున్నారు.

Advertisements
మయన్మార్‌కు రోబోటిక్స్‌ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపిన భారత్‌

3,600 మందికి పైగా మరణాలు
మయన్మార్‌లో గత నెల 28న సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా 3,600 మందికి పైగా మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే శిథిలాల్లో చిక్కుకున్న వారిని భద్రతా బృందాలు వెలికితీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత ఆర్మీకి చెందిన సిబ్బంది అధునాతన సామగ్రిని వినియోగిస్తున్నారు. నాలుగు కాళ్లుండే రోబోటిక్స్‌ మ్యూల్స్‌తో శిథిలాల కింద వెతుకుతున్నారు. నానో డ్రోన్లతోనూ అణువణువూ గాలిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
వందల టన్నుల ఆహారాన్నిసరఫరా
భారత్‌ ఇప్పటికే ఆపరేషన్‌ బ్రహ్మలో భాగంగా 31 టన్నుల సామగ్రిని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో మయన్మార్‌కు పంపింది. మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని కూడా అందజేసింది. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్‌ ఆసుపత్రి భూకంప క్షతగాత్రులకు వైద్య సేవలను అందిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన “ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌” వందల టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చింది. గతనెల 28న రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు మయన్మార్‌ పూర్తిగా అతలాకుతలమైంది. దీనితో ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకువచ్చాయి.

Read Also: Donald Trump: ట్రంప్ వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి!

Related Posts
దీపావళికి ముందు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..ప్రజల ఇబ్బందులు
Increased air pollution in Delhi before Diwali.People problems

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, Read more

బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్ దుమారం ?
బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్ దుమారం ?

బెంగళూరులో అంతులేని ట్రాఫిక్ జామ్‌లు మరోసారి వార్తల్లో ప్రధాన చర్చకు దారితీశాయి. అభివృద్ధికి తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవటంతో నగరంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి Read more

US Homeland: హార్వర్డ్‌కి అమెరికా హోంల్యాండ్ శాఖ పెద్ద షాక్
హార్వర్డ్‌కి అమెరికా హోంల్యాండ్ శాఖ పెద్ద షాక్

విదేశీ విద్యార్థుల చేర్పు అధికారాన్ని రద్దు చేస్తామని హెచ్చరిక అంతర్జాతీయ విద్యార్థులపై చట్టవిరుద్ధమైన, హింసాత్మక కార్యకలాపాల రికార్డులు ఏప్రిల్ 30, 2025 లోపు అందించకపోతే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం Read more

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొర్రా గోపీమూర్తి
pramana1

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×