हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

Vanipushpa
Donald Trump: సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, మెక్సికో, కెనడాల మాదిరి భారత్‌తో అమెరికా ప్రవర్తించకపోవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. భారత్‌తో తమకు టారిఫ్‌ సమస్య మాత్రమే ఉందని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధుల బృందం వెల్లడించినట్లు తెలిసింది.

సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలు వచ్చేనెల 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలను ముమ్మరం చేశాయి. టారిఫ్‌లపై చర్చించేందుకు ఈనెల మెుదట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లారు. తాజాగా అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం దిల్లీలో పర్యటిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
సజావుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతిపాదిత టారిఫ్‌ల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. కొన్ని కీలక రంగాలకు చెందిన ఉత్పత్తులపై తక్కువ టారిఫ్‌ ఉండేలా అమెరికా ప్రతినిధి బృందంతో, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది.
అమెరికా ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు చెందిన 87 శాతం ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చని కేంద్ర ప్రభుత్వం జరిపిన అంతర్గత విశ్లేషణలో వెల్లడైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ యోచిస్తోందని తెలిపింది. వచ్చేనెల రెండు లోపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870