మీరు రోజూ మందులు వేసుకుంటుంటారా.. అయితే మీ మందుల ఖర్చులు కాస్త పెరగనున్నాయి. ఎందుకంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) అవసరమైన మందుల ధరలను 1.74% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది, దింతో మందులు వాడే లక్షలాది మందికి వీటి ఖర్చు భారం పెరుగుతుంది. ఈ మందుల ధరల పెరుగుదల కారణంగా క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు అలాగే యాంటీబయాటిక్స్ వంటి మందుల ధరలు పెరిగాయి. వీటిలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, యాంటీ-అలెర్జీ, యాంటీ-అనీమియా, విటమిన్ టాబ్లెట్లు ఇంకా ఖనిజాల మందులు ఉన్నాయి. ఈ మందులను సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ధరలు పెరిగిన మందుల లిస్టులో 800 మందుల పేర్లు ఉన్నాయి.

చాలా కాలంగా ధరలను పెంచాలని డిమాండ్
ధరలు ఎందుకు పెంచుతున్నారు: NPPA ప్రకారం, ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవసరమైన మందుల ధరలను సమీక్షిస్తుంది అలాగే ఈసారి కూడా హోల్ సేల్ ప్రయిస్ ఇండెక్స్ (WPI) పెరుగుదల కారణంగా, మందుల కంపెనీలు ధరలను పెంచడానికి అనుమతించాయి. ముడి పదార్థాల ధరలు అంటే మందులు తయారు చేయడానికి ఉపయోగించే పదార్ధాల ధరలు కొంతకాలంగా పెరుగుతున్నాయని, ఈ కారణంగా ధరలు కూడా పెరిగాయని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. అయితే కంపెనీలు చాలా కాలంగా ధరలను పెంచాలని డిమాండ్ చేసాయి.

మందుల ధర పెంపు ప్రభావం
దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఇప్పుడు మందుల కోసం కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగే అవకాశం పెరుగుతుంది. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న సామాన్యులకు మందులు కొనడం కాస్త కష్టం కావచ్చు. గత సంవత్సరం కూడా పెరిగిన ధరలు: 2023లో కూడా NPPA మందుల ధరలను 12% వరకు పెంచింది, దింతో ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న రోగులపై అదనపు భారాన్ని మోపింది.