భారత తపాలా శాఖ (India Post) తాజాగా ఓ వినూత్న డిజిటల్ సేవను ప్రారంభించింది. పేరు డిజిపిన్ – ఇది ప్రతి వ్యక్తికి ఖచ్చితమైన డిజిటల్ చిరునామా కల్పిస్తుంది.డిజిపిన్ అనేది ఓ డిజిటల్ అడ్రస్, ఇది మీ మొబైల్ (Mobile) స్థానం ఆధారంగా జెనరేట్ అవుతుంది. దీన్ని ఐఐటీ హైదరాబాద్, ఇస్రో సహకారంతో తపాలా శాఖ అభివృద్ధి చేసింది.

అందుబాటులోకి వచ్చిన కొత్త సౌకర్యాలు
తపాలా శాఖ తాజాగా రెండు కొత్త ప్లాట్ఫారమ్లు ప్రవేశపెట్టింది:
Know Your Digipin
Know Your Pincode
ఇవి ఖచ్చితమైన చిరునామా సమాచారం అందించేందుకు రూపొందించబడ్డాయి.ఇకపై డిజిపిన్తో పార్శిళ్ల డెలివరీ మరింత సులభం అవుతుంది. ప్రతి డిజిపిన్ గూగుల్ మ్యాప్స్లోని ఒక ప్రత్యేక స్థలాన్ని సూచిస్తుంది. అక్షాంశం, రేఖాంశం ద్వారా సరిగ్గా ఆ చిరునామాకు సేవలు చేరవచ్చు.
గ్రామీణ ప్రాంతాలకు అమోఘమైన సాధనం
అనేక గ్రామాల్లో సరైన చిరునామాలే లేవు. ఇక్కడే డిజిపిన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ సదుపాయం సరైన సేవా డెలివరీకి మార్గం కల్పిస్తుంది.ఈ యాప్ పాత 6 అంకెల పిన్ కోడ్ వ్యవస్థను మరింత ఖచ్చితంగా పరిచయం చేస్తుంది. ప్రతి పిన్ కోడ్ను డిజిటల్ మ్యాప్తో లింక్ చేశారు.ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు సరిగ్గా తమ ప్రాంతానికి సంబంధించిన పిన్ కోడ్ తెలుసుకోవచ్చు. జిల్లా, మండలం, గ్రామం మేరకు ఖచ్చితమైన వివరాలు కనిపిస్తాయి.ఈ యాప్లో వినియోగదారులు ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. తపాలా శాఖ ఈ సూచనలతో పిన్ కోడ్ డేటాను మెరుగుపరుస్తుంది.
డిజిటల్ ఇండియాలో తపాలా శాఖ కీలక పాత్ర
పోస్టల్ శాఖ కార్యదర్శి వందిత కౌల్ ఈ చొరవను “డిజిటల్ ఇండియాలో పెద్ద అడుగు”గా పేర్కొన్నారు. ఇది ప్రతి పౌరుడిని డిజిటల్గా అనుసంధానించేందుకు ఒక ప్రధాన మార్గం అవుతుందని చెప్పారు.పోస్టల్ సేవలు ఇక మరింత ఖచ్చితంగా, అందుబాటులో ఉండేలా మారనున్నాయి. చిరునామా తేడాల వల్ల సంభవించే ఆలస్యాలు తగ్గిపోతాయి.డిజిపిన్ ద్వారా భారత తపాలా వ్యవస్థ మరింత ఆధునీకరించబడుతుంది. ఇది నెలలు, సంవత్సరాలు ఉండే చిరునామా సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తుంది.
Read Also : Earthquake : మణిపూర్ లో వరుసగా మూడు భూకంపాలు