వల్లభనేని అరెస్ట్:
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ను అరెస్ట్ చేయడంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీసులో ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారనే ఆరోపణలతో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఏ కేసులో అరెస్ట్?
సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీపై పటమట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు 140, 308, 351 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద మొత్తం 7 కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఉన్న వంశీని రాయదుర్గం పోలీసుల సహకారంతో గురువారం అరెస్ట్ చేశారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:
వంశీ అరెస్టుతో అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసే అవకాశముందని పోలీసులు భావించారు. దీంతో బెజవాడలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గన్నవరం, పటమట, విజయవాడ తదితర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పేర్నినానిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పటమట పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందిగామ దగ్గర వంశీ భార్య కారును కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది.
విజయవాడలో వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం:
వల్లభనేని వంశీ అరెస్టుతో విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడే అవకాశముందని భావించిన వ్యాపారులు తమ దుకాణాలను మూసివేస్తున్నారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
అత్యవసర సేవలు మినహా, అనవసర రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. అందరికీ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.
వంశీ అరెస్ట్పై టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అంటూ టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ చేసిన అరాచకాలు మర్చిపోతే ఎలా అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.