టీవీ ఇంట‌ర్వ్యూలో బాబాపై దాడి?

టీవీ ఇంట‌ర్వ్యూలో బాబాపై దాడి?

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఐఐటీ బాబా (అభయ్ సింగ్). నోయిడాలో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో అభయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాడి వివరాలు

ఐఐటీ బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ శుక్రవారం నోయిడాలో ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకుంది.ఇంటర్వ్యూ జరుగుతుండగానే కొంతమంది కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు అకస్మాత్తుగా అభయ్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆయ‌న‌.. త‌న‌కు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు బైఠాయించారు. దీంతో పోలీస్ అధికారులు ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పి అక్క‌డి నుంచి పంపించారు.  ఈ ఘ‌ట‌న‌కు ముందు అభ‌య్ సింగే స‌ద‌రు ఛానెల్ యాంక‌ర్‌పై దాడి చేసిన‌ట్లు తెలిసింది. అభయ్ సింగ్ హర్యానాకు చెందిన వ్యక్తి.ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు.అయితే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడై తన ఉద్యోగాన్ని వదిలి, సన్యాసాన్ని అంగీకరించారు.మహా కుంభమేళాలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత “ఐఐటీ బాబా”గా ప్రాచుర్యం పొందారు.

iit baba

ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ముంబైలోని ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, కెనడాలో లక్షల జీతంతో ఉద్యోగం చేశారు. అయితే, ఆధ్యాత్మికతపై ఆసక్తి కారణంగా, ఆ ఉద్యోగాన్ని వదిలి సన్యాసి మార్గాన్ని ఎంచుకున్నారు.

Related Posts
Donald Trump: మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు
మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై Read more

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్
bsnl

ఏడాది కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. తరచూ రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రూ.2398 ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ Read more

అభిమానులకు వరుణ్ చక్రవర్తి ఊరట..వీడియో వైరల్
అభిమానులకు వరుణ్ చక్రవర్తి ఊరట..వీడియో వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత జట్టు.. టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో అందరు అనుకున్నట్లే ట్రావిడ్ హెడ్ Read more

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి తృణమూల్ మద్దతు
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి తృణమూల్ మద్దతు

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం Read more