ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఐఐటీ బాబా (అభయ్ సింగ్). నోయిడాలో ఓ టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనతో అభయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడి వివరాలు
ఐఐటీ బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ శుక్రవారం నోయిడాలో ఓ ప్రైవేట్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకుంది.ఇంటర్వ్యూ జరుగుతుండగానే కొంతమంది కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు అకస్మాత్తుగా అభయ్ సింగ్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు బైఠాయించారు. దీంతో పోలీస్ అధికారులు ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనకు ముందు అభయ్ సింగే సదరు ఛానెల్ యాంకర్పై దాడి చేసినట్లు తెలిసింది. అభయ్ సింగ్ హర్యానాకు చెందిన వ్యక్తి.ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు.అయితే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితుడై తన ఉద్యోగాన్ని వదిలి, సన్యాసాన్ని అంగీకరించారు.మహా కుంభమేళాలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత “ఐఐటీ బాబా”గా ప్రాచుర్యం పొందారు.

ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.అభయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ముంబైలోని ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, కెనడాలో లక్షల జీతంతో ఉద్యోగం చేశారు. అయితే, ఆధ్యాత్మికతపై ఆసక్తి కారణంగా, ఆ ఉద్యోగాన్ని వదిలి సన్యాసి మార్గాన్ని ఎంచుకున్నారు.