'తల్లికి వందనం' కు మార్గదర్శకులు

Lotteries in AP : ఆంధ్రాలో లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ అనుమతించే ఆలోచన!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పన్నులు, జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ ఉండటం ప్రభుత్వాన్ని వేధిస్తోంది. గతంలో జగన్ సర్కార్ కంటే ప్రస్తుతం పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు డబ్బు లేకపోవటమే అనే వాదన కూడా వినిపిస్తోంది.

Advertisements
ఆంధ్రాలో లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ అనుమతించే ఆలోచన!

ఆదాయం పొందే ప్రణాళికలు
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సర్కార్ పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ అదనపు పన్నులు, సెస్‌ల ద్వారా రూ.13,100 కోట్ల వరకు ఆదాయం పొందే ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం చంద్రబాబు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
ఏపీలో ప్రస్తుతం లాటరీలపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌లపై ప్రతిపాదిత పన్నుపై చట్టపరమైన అభిప్రాయం కూడా అవసరమని సదరు అధికారి పేర్కొన్నారు.

కొత్త ఆదాయాల అన్వేషణ పనిలో..
ఆమోదం పొందిన తర్వాత వినోద పన్ను పెంపు సినిమా థియేటర్లు, పార్కులు, ఇతర పర్యాటక ఆకర్షణలలో అధిక ఛార్జీలకు దారితీస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, సూపర్ సిక్స్ పథకాల కింద ఎన్నికల ముందు వాగ్దానాలలో భాగంగా రాష్ట్రంలో అమలు చేయబడుతున్న మెగా సంక్షేమ పథకాలను కొనసాగించడానికి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నందున, పన్ను ఆదాయం పెరగడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా మారిపోయింది. కొత్త పన్ను ప్రతిపాదన ఆమోదించబడితే పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలుస్తోంది.

Related Posts
పోసానిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు..
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

ఏపీలో కూటమి సర్కార్ దూకుడు రోజు రోజుకు పెంచుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే తమ పై విమర్శలు , అసభ్యకర మాటలు , వీడియోలు పోస్ట్ చేసి Read more

బుడంపాడు నారాకోడురు రహదారిపై ఘోరప్రమాధం
బుడంపాడు నారాకోడురు రహదారి పై ఘోర ప్రమాధం

బుడంపాడు నారాకోడురు రహదారిపై ఘోరప్రమాధం.ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. సంఘటన స్థలంలోనే మృత్యువాత పడిన ముగ్గురు కూలీలు...ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.సంఘటన Read more

Pawan Kalyan : చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పవన్ కల్యాణ్
Chandrababu experience is necessary for the state.. Pawan Kalyan

Pawan Kalyan : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Read more

మహిళల రక్షణ కోసం అందుబాటులోకి యాప్
మహిళల రక్షణ కోసం అందుబాటులోకి యాప్

మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో కీలకమైన చర్యలు చేపట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో, హోమ్ మంత్రి వంగలపూడి అనిత అధికారులను మహిళల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×