हिन्दी | Epaper

Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

Divya Vani M
Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గురువారం రాయలసీమ రైతులకు మరెన్నడూ మర్చిపోలేని ఇచ్చారు. నంద్యాల జిల్లా (Nandyal District) మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద రెండు మోటార్లను ఆన్ చేసి, హంద్రీ-నీవా సుజల శ్రావంతి (HNSS) ఫేజ్-1 నుంచి నీటిని విడుదల చేశారు.శ్రీశైలం బ్యాక్ వాటర్‌ల నుంచి రాయలసీమ దిశగా కృష్ణా జలాల రవాణాకు శ్రీకారం చుట్టారు. దీంతో సాగునీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న నాలుగు జిల్లాల్లోని రైతులకు ఊరట కలిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు రామనాయుడు, కేశవ్, బైరెడ్డి శబరి పాల్గొన్నారు.హంద్రీ-నీవా ప్రధాన కాలువ సామర్థ్యం 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెరిగింది. ఈ విస్తరణతో 40 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులోకి వచ్చింది. ఇది రాయలసీమలో తాగునీరు, సాగునీటి సమస్యలకు కీలక పరిష్కారంగా మారనుంది.

Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు
Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

మల్యాల నుంచి జీడిపల్లి వరకు నీటి ప్రవాహం

ప్రాజెక్ట్ నుంచి విడుదలైన నీరు నంద్యాల జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు తరలించబడుతుంది. అక్కడినుంచి పెన్నా-అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కి 15 రోజులు నీరు విడుదల చేయనున్నారు.ఈ కార్యక్రమం గురించి సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారు. “రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నాకు అసలైన ఆనందం” అన్నారు. కాలువ సామర్థ్యం పెంపుతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు.

Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు
Chandrababu : ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది : చంద్రబాబు

వంద రోజుల్లో పూర్తి–రూ.3,890 కోట్లు వ్యయం

ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.3,890 కోట్లు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే పనులు పూర్తిచేసి రికార్డు నెలకొల్పిందని సీఎం అన్నారు. “నీళ్లు ఉంటే రైతన్నలు బంగారం పండిస్తారు. అదే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.గొల్లపల్లి, మరాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు త్వరలో నిండనున్నాయి. ఇది రాయలసీమ ప్రాంతానికి నీటి పట్ల ఉన్న ఆకాంక్షలకు సమాధానంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఇది ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయి అవుతుందని అభిప్రాయపడ్డారు.

Read Also : KTR : రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

📢 For Advertisement Booking: 98481 12870