हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

Rohit sharma: నేను సరిగ్గా ఆడట్లేదు : రోహిత్‌ శర్మ

Anusha
Rohit sharma: నేను సరిగ్గా ఆడట్లేదు : రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం ఓ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో, రోహిత్‌ను పక్కన పెట్టడం కొంత వివాదాస్పదమైంది. అయితే ఈ సీజన్‌లోకి వచ్చేసరికి ముంబై ఫ్యాన్స్ కూడా పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించారు.రోహిత్‌ శర్మ ప్రస్తుతం పూర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. అంతకంటే ముందు కూడా సరైన ఫామ్‌లో లేని రోహిత్‌ అదే బ్యాడ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా తన ఫామ్‌ గురించి రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నిజాయితీగా చెప్పాలంటే నేను బంతిని సరిగా కొట్టడం లేదు. ఆ సమయంలో గిల్ ఆడతే బాగుంటుందని మేం అనుకున్నాం. అతను చాలా మంచి ఆటగాడు, అంతకంటే ముందు టెస్ట్‌ మ్యాచ్ గిల్‌ ఆడలేదు.

సిడ్నీ టెస్ట్‌

సెలెక్టర్‌తో మాట్లాడాను – వారు నా నిర్ణయాన్ని అంగీకరించారు. టీమ్‌కు ఏది మంచిదో అదే చేయాలని, అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతే అలా జరిగిపోయింది.” అంటూ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌కు తానకు తానుగా ఎందుకు దూరం ఉండాల్సి వచ్చిందో రోహిత్‌ శర్మ వివరించాడు. ఆ టైమ్‌లోనే నేను మెచ్యురిటీ ఉన్న మనిషిని, ఇద్దరు పిల్లల తండ్రి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది నాకు తెలియదా అంటూ రోహిత్‌ శర్మ తనపై వచ్చే విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా కూడా ఆ విషయంపై స్పందించాడు. ఆ బీజీటీ టోర్నీలో టీమిండియా ఫేలవ ప్రదర్శన కనబర్చింది. విరాట్‌ కోహ్లీ ఆరంభంలో ఒక సెంచరీ చేసినా తర్వాత అతను కూడా విఫలం అయ్యాడు.

 Rohit sharma: నేను సరిగ్గా ఆడట్లేదు : రోహిత్‌ శర్మ

బ్యాడ్‌ ఫామ్‌

ఆ టోర్నీ తర్వాత కోహ్లీ, రోహిత్‌ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ రాణిస్తుండగా రోహిత్‌ శర్మ మాత్రం అదే బ్యాడ్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. మోకాలి గాయంతో ఒక మ్యాచ్‌ కూడా రోహిత్‌ దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సిడ్నీ టెస్ట్‌ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఇదే బ్యాడ్‌ ఫామ్‌ కొనసాగితే తర్వాత మ్యాచ్‌లకు రోహిత్‌ ఏమైనా దూరంగా ఉంటాడా అనే చర్చ కూడా మొదలైంది. మరి చూడాలి రోహిత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

Read Also: Sam Billings: ఏ టోర్నమెంట్ అయినా ఐపీఎల్ తర్వాతే :సామ్ బిల్లింగ్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870