हिन्दी | Epaper

Telugu news: Maoists: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

Sushmitha
Telugu news: Maoists: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా కాంకేర్, గరియాబంద్ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాల రాకను గుర్తించిన నక్సలైట్లు వారిపైకి కాల్పులు జరపగా, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య గంటలపాటు కాల్పులు కొనసాగాయి.

Read Also: Naegleria fowleri: అమీబాతో కేరళలో 20 మంది మృతి

 Maoists

రివార్డులు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులపై మొత్తం రూ.14 లక్షల రివార్డు ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

  • మృతి చెందిన వారి వివరాలు:
    • సర్వాన్ మడ్కంసౌ: రూ.8 లక్షల రివార్డు, మావోయిస్టు కోఆర్డినేషన్ ఏరియా కమిటీ కార్యదర్శి.
    • రాజేష్ అలియాస్ రాకేష్ హేమ్లా: రూ.5 లక్షల రివార్డు, నగరి ఏరియా కమిటీ గోబ్రా కమాండర్.
    • బసంతి కుంజమ్: రూ.1 లక్ష రివార్డు.

మావోయిజం అంతరించిపోతుంది: ఐజీ సుందర్‌రాజ్

కాల్పుల ఘటనపై బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(General of Police) సుందర్‌రాజ్ స్పందించారు. మావోయిజం అంతరించిపోయే దశలో ఉందనే వాస్తవాన్ని మావోయిస్టు కార్యకర్తలు అంగీకరించాలని ఆయన అన్నారు. భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను మరింత ముమ్మరం చేశాయని ఆయన పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ఎక్కడ జరిగింది?

కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

మృతి చెందిన మావోయిస్టులపై ఉన్న మొత్తం రివార్డు ఎంత?

మృతి చెందిన ముగ్గురిపై భద్రతా దళాలు రూ.14 లక్షల రివార్డు ఉన్నట్లు గుర్తించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870