హైదరాబాద్ అమీర్పేటలో మరో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. మైత్రీవన ప్రాంతంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో ఉదయం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి అక్కడి విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సిబ్బంది వెంటనే స్పందించడంతో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
Read also: Hyderabad: హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు

Fire breaks out at coaching center in Maithrivanam
సెంటర్లోని బ్యాటరీలు పేలినట్లు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం సుమారు 10 గంటల సమయంలో సెంటర్లోని బ్యాటరీలు పేలినట్లు భావిస్తున్నారు. పేలుళ్ల తర్వాత మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో అక్కడున్నవారు బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీసి, మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది.
అమీర్పేటలో (Ameerpet) వందలాది కోచింగ్ సెంటర్లు పనిచేస్తుండటంతో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇవ్వాళ్టి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: