జనాభాలో దూసుకెళ్తున్న హైదరాబాద్

జనాభాలో దూసుకెళ్తున్న హైదరాబాద్

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగరబాట పడుతున్నారు. నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండంటతో సిటీలో సెటిల్ అయ్యేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో హైదరాబాద్ నగర జన సాంద్రత పెరిగుతోంది. జన సాంద్రత విషయంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీని హైదరాబాద్ వెనక్కి నెట్టింది.
తొలి స్థానంలో ముంబై
తెలంగాణ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (ATLAS)-2024 నివేదిక గణంకాలు వెల్లడించింది. నగరంలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది జనాభా సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంఖ్య రాజధాని ఢిల్లీలో చదరపు కిలోమీటరుకు 11,313 మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. జన సాంద్రత విషయంలో ఇండియాలో ముంబై తొలి స్థానంలో ఉంది. అక్కడ చదరపు కిలోమీటరుకు 28,508 ఉన్నట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరంగా ఫిలిప్పీన్స్‌లోని మనీలా నిలిచింది. అక్కడ ఒక చదరపు కిలోమీటరులో 43,079 మంది నివసిస్తున్నారు.

Advertisements
జనాభాలో దూసుకెళ్తున్న హైదరాబాద్

సవాల్‌గా మారుతున్న జన సాంద్రత
అయితే వేగవంతమైన పట్టణీకరణ ఓ సవాల్ లాంటిదేనని నిపుణులు అంటున్నారు. అది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిందని చెబుతున్నారు. జనాభా పెరుగుదలతో ఓ వైపు హైదరాబాద్ నగరం వృద్ధి పథంలోకి వెళ్తున్నా.. అదే సమయంలో అందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించటం ప్రభుత్వానికి శక్తికి మించిన పని అంటున్నారు. పెరగుతున్న జనాభా మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలు, ఇండ్ల నిర్మాణంపై ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఓ వైపు హైదరాబాద్ నగరంలో జన సాంద్రత పెరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.
పెరుగుతున్న వృద్ధ జనాభా
2011 జనాభా లెక్కల డేటా ప్రకారం.. రాష్ట్ర జనాభా 3.5 కోట్లుగా ఉంది. తెలంగాణ మెుత్తం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణాన్ని కలిగి ఉంది. చదరపు కిలోమీటరుకు 312 మంది జనాభా సాంద్రతను కలిగి ఉంది. 2031 నాటికి ఇది మరింత తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో యువ జనాభా కూడా తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. 2031 నాటికి 39 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారి జనాభా 0.23 శాతం తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే సమయంలో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందని.. దీని కారణంగా రాష్ట్రంలో వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

Related Posts
Hussain: వేలంలో హుస్సేన్ చిత్రానికి పలికిన రూ. 118 కోట్లు
Hussain: వేలంలో హుస్సేన్ చిత్రానికి పలికిన రూ. 118 కోట్లు

భారతీయ చిత్రకళలో సరికొత్త రికార్డు భారతదేశ చిత్రకళలో చరిత్ర సృష్టించిన మరో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ‘గ్రామయాత్ర’ అనే చిత్రానికి Read more

మూడోరోజు భారీగా నష్టపోయిన మార్కెట్లు
మూడోరోజు భారీగా నష్టపోయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, చైనా ఆర్థిక Read more

Encounter : మరోసారి జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జవాన్ మృతి
Encounter in Jammu and Kashmir once again

Encounter: గురువారం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. బసంత్‌గఢ్‌లో జమ్మూ కాశ్మీర్ Read more

IPL 2025: ఎస్‌ఆర్‌హెచ్‌ పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం
IPL 2025: ఎస్‌ఆర్‌హెచ్‌ పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

ఐపీఎల్ 2025లో భాగంగా ,ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆతిథ్య జట్టును 7వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని Read more

×