దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది.

ఎన్నికల వేళ భారీ డిస్కౌంట్స్

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రితో పోలింగ్ సిబ్బంది బూత్‌లకు తరలి వెళ్తోన్నారు. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.

csm salon quer 2018 layers end 3a3d383d87

సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. చాలామంది ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు.15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు. 2020 నాటి ఎన్నికల్లోనూ చరిత్ర తిరగరాసింది ఆప్. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడూ అలాంటి రికార్డే సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా- పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఛాంబర్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీని పరిధిలోని అన్ని దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కిరాణా షాపులు, హోటళ్లు, మాల్స్, ధాబాలు, కాఫీ షాపులు.. ఇలా అన్నింట్లోనూ 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Related Posts
రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం
రేవంత్ రెడ్డి అధ్యక్ష తెలంగాణ కేబినెట్ సమావేశం

రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం తెలంగాణ కేబినెట్ ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more

ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఫొటోలను తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Read more

రూ. 2 కోట్లు నష్టపోయిన యువకుడు – యూట్యూబర్ ‘లోకల్ బాయ్’ నాని అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్ వివరాలు:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ Read more

రైతు భరోసా పథకం నిధులు విడుదల
rythubharosa

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద సోమవారం (ఫిబ్రవరి 10న) భారీగా నిధులను విడుదల చేసింది. 2 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *