हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Operation Sindhoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

Vanipushpa
Operation Sindhoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

భారత్-పాకిస్తాన్ (India Pakistan) మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో, భారత వైపున్న సరిహద్దు (Boders)లోని ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి బయటికి వెళ్లిపోతున్నారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర జరుగుతున్న భారీ కాల్పుల నుంచి బయటపడేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పహల్గాం (Pahalgam)లో పర్యటకులపై దాడి అనంతరం, సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను చేపడుతోందని భారత్ చెబుతోంది.
మే 7న బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌పై వైమానిక దాడులు జరిపినప్పటి నుంచి ఎల్ఓసీ (LOC) గుండా జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా, 59 మంది గాయపడ్డట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

OperationSindoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?
OperationSindoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

మృతుల్లో మహిళలు, పిల్లలు
మృతుల్లో మహిళలు, పిల్లలు, భారత ఆర్మీ జవాను లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు. పంజాబ్‌లోని చాలా జిల్లాల్లో క్షిపణులు, డ్రోన్ల శకలాలను గుర్తించిన తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మే 7, 8 తేదీల్లో రాత్రిపూట పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను, క్షిపణి దాడులను భగ్నం చేసినట్లు భారత్ చెప్పింది. ఆ తర్వాత గురువారం (మే 8న) లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసినట్లు భారత్ తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని పాకిస్తాన్ ధ్రువీకరించలేదు.
బుధవారం రాత్రి డ్రోన్, క్షిపణి దాడులు
ఎల్‌ఓసీ సమీపంలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంఛ్, రజౌరిలలో భారీ ఫిరంగులను వాడుతున్నట్లు గురువారం విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పూంఛ్‌లోని గురుద్వారాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆ దాడిలో సిక్కు వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిపారు. బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడికి యత్నించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అవంతీపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్, భుజ్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను జరిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా దాడులకు అడ్డుకట్ట
”ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దాడులను అడ్డుకున్నాం. పలు ప్రాంతాల్లో ఈ దాడుల శకలాలను గుర్తించాం. పాకిస్తాన్ దాడులు జరిపినట్లు ఇవి ధ్రువీకరిస్తున్నాయి” అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి 25 భారత డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ల వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పింది.
ఎల్ఓసీ వద్ద పరిస్థితి ఎలా ఉంది?
” భారీ పేలుళ్లను నేను విన్నాను. ఏడాది బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని వచ్చాను. నాకు చాలా భయం వేసింది” అని స్థానికురాలు సోబియా చెప్పారు. తమ ఇంటి ఎదుట షెల్ పడటంతో, ఇంటి నుంచి తాను, తన కుటుంబం బయటికి వచ్చినట్లు స్థానికులైన సఫ్రీన్ అఖ్తర్ చెప్పారు. ”ఆ సమయంలో కారు కనిపించలేదు. సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వచ్చింది. దారంతా కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉంది” అని అన్నారు.

గత 48 గంటలుగా పూంఛ్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుండటంతో, సురాన్‌కోట్‌లోని తమ బంధువులను, స్నేహితులను ఆశ్రయాన్ని కోరుతున్నట్లు చాలామంది చెప్పారు. ఇది సరిహద్దుకు కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ కాల్పుల ఘటనలు ఎక్కువగా జరగడం లేదు. ”మా ఇంట్లో 25 మంది వరకు ఉంటున్నారు. కొంతమంది నడుస్తూ ఇక్కడకు వచ్చారు. కొందరు తమ ఇళ్లకు తాళాలను కూడా వేసుకోలేకపోయారు” అని సురాన్‌కోట్‌కు చెందిన మొహమ్మద్ ఆలమ్ మాలిక్ చెప్పారు. ”అంతకుముందు అంత విస్తృతంగా ప్రజల తరలింపు లేదు. 2016లో సరిహద్దు సమీపంలో నివసించే 27 వేల మందికి పైగా బయటికి వెళ్లిపోయారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు సరిహద్దులో నివసించే వారికి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి”
పంజాబ్ గ్రామాల్లో రాకెట్ లాంటి వస్తువులు
పంజాబ్‌లోని పలు గ్రామాల్లో గురువారం రాకెట్ లాంటి వస్తువుల శకలాలను గుర్తించినట్లు బీబీసీ పంజాబీ తెలిపింది. కొన్ని శిథిలాలను గుర్తించానని, తన పొలం తగలబడిపోయిందని గుర్దాస్‌పూర్‌లోని పంధేర్ గ్రామానికి చెందిన రచ్‌పాల్ సింగ్ తెలిపారు. బుధవారం రాత్రి అమృత్‌సర్, భటిండా, గుర్దాస్‌పూర్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనుమానిత వస్తువులను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నాయని తాము భావిస్తున్నట్లు గ్రామస్థులు చెప్పారు. ”రాత్రి పూట భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉదయం పూట పొలంలో క్షిపణి శకలాలను గుర్తించాం. వీటి గురించి పోలీసులకు చెప్పాం” అని అమృత్‌సర్‌లోని జేతువాల్ గ్రామవాసి దిల్దార్ సింగ్ తెలిపారు. పొలాల్లో 6 నుంచి 7 అడుగుల రాకెట్ లాంటి వస్తువును చూసినట్లు మరో స్థానికుడు లవ్‌ప్రీత్ సింగ్ చెప్పారు. మోగా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక పశువుల షెడ్డుపై ఇనుప వస్తువు పడిందని బీబీసీ ప్రతినిధి సురీందర్ మన్ చెప్పారు. తల్వాండిలోని భాంగేరియా గ్రామంలో ఇలాంటి ఒక ఇనుప వస్తువును గుర్తించారు. పరిపాలనా యంత్రాంగం వీటిపై విచారణ ప్రారంభించింది. ఈ వస్తువులపై స్థానిక అధికారులు మరింత సమాచారం ఇవ్వలేదు.

Read Also: Pakistan: పాకిస్థాన్‌-భారత్‌ దాడులపై RSS చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

📢 For Advertisement Booking: 98481 12870