हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు

Sudheer
Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు దిశగా కదిలి ప్రస్తుతం తమిళనాడు (Tamil Nadu) నుంచి ఆంధ్రప్రదేశ్ (AP) వైపు అడుగులు వేస్తోంది. వాతావరణ శాఖ పేర్కొనిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనం రానున్న రోజుల్లో తుపాను(Thoofan)గా మారే అవకాశముందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, వర్షాలు కురిసే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాలని, వర్షం సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచనలు జారీ చేసింది. ఏపీలో విజయనగరం, పార్వతీపురం, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

తెలంగాణ లోను భారీ వర్షాలు

తెలంగాణలోనూ వర్షాల ముప్పు నెలకొంది. సాయంత్రం 5 గంటల తర్వాత పశ్చిమ తెలంగాణలో వర్షం మొదలై రాత్రంతా కురిసే అవకాశం ఉంది. గద్వాల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి లేకుండా మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Read Also : India – Pakistan War : కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870