हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

IMD Weather: 26 రాష్ట్రాలకు భారీ వర్షాలు..IMD హెచ్చరికలు జారీ

Vanipushpa
IMD Weather: 26 రాష్ట్రాలకు భారీ వర్షాలు..IMD హెచ్చరికలు జారీ

దేశంలోని 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో పాటు మే 8 వరకు ఈ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్​లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ ఆలర్ట్, తూర్పు రాజస్థాన్​కు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఇలా వున్నాయి. మే 6న రాజస్థాన్, గుజరాత్​, ఛత్తీస్​గఢ్​, కర్ణాటక, కేరళలో భారీ వర్షం, గాలులు కురుస్తాయని IMD తెలిపింది. మే 7న గుజరాత్​, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

IMD Weather: 26 రాష్ట్రాలకు భారీ వర్షాలు..IMD హెచ్చరికలు జారీ
IMD Weather: 26 రాష్ట్రాలకు భారీ వర్షాలు..IMD హెచ్చరికలు జారీ


ఈశాన్య రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు
మే 8న మహారాష్ట్ర, గుజరాత్​తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెప్పింది. జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​, దక్షిణ తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని చెప్పింది. మరోవైపు ఒడిశాలోని మయూర్​భంజ్​, కియోంజర్​, బాలేశ్వర్​ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. బంగాల్​, బిహార్ నుంచి అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, కోస్తాంధ్రకు కూడా వర్ష ప్రభావం ఉందని తెలిపింది.
ఈ రాష్ట్రాలకు హిమపాతం సంభవించే ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్​లోని కొండ ప్రాంతాలైన లాహౌల్​, కిన్నౌర్​లో హిమపాతం సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే అలాంటి ప్రాంతాలను సందర్శించకూడదని పర్యటకులు సూచించింది. స్కూళ్లను సైతం మూసి ఉంచాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్​లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరగిపడడంతో పాటు వరదలు వచ్చాయి. ఫలితంగా చార్​ధామ్​ యాత్రికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్​లో గడిచిన 24 గంటల్లో సుమారు గంటకు 70 నుంచి 100 కిమీ వేగంతో గాలులు వీచాయని తెలిపింది. జమ్ము కశ్మీర్​, లద్దాఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్​లో 70కిమీ వేగంతో గాలుల వచ్చాయని చెప్పింది.
గాలులు, వడగళ్ల
మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించింది. గాలులు, వడగళ్ల నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉండాలని తెలిపింది. ముఖ్యంగా కొండలు, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనను విరమించుకోవాలని చెప్పింది. రైతులు సైతం పంట రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఎన్డీఆర్​ఎఫ్​తో పాటు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండ ప్రాంతాల్లో హిమపాతం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేయడం, స్కూల్స్‌ను మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించబడింది.

Read Also: Kashmir: కశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః ప్రారంభం ..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870