పిల్లలు మట్టిలో ఆడడం, సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల వారి శరీరంలో నులి పురుగులు (Worms
) ఏర్పడతాయి. ఈ నులి పురుగులు (పరాన్నజీవులు) పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆకలి తగ్గిపోవడం, రక్తహీనత, కడుపు నొప్పి, పోషకాహార లోపం వంటి సమస్యలకు ఇవి కారణమవుతాయి. అంతేకాకుండా, పిల్లల ఎదుగుదల కూడా మందగిస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి చిన్న వయస్సు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
నులి పురుగుల నివారణకు సరైన మార్గం
1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నులి పురుగుల నివారణకు మందులు తప్పనిసరిగా వాడాలి. ఈ మందులు ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడతాయి. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10న ‘నులి పురుగుల నివారణ దినోత్సవం’ (National Deworming Day) నిర్వహిస్తుంది. ఈ రోజులలో ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా మాత్రలు పంపిణీ చేస్తారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు మందులు వేయించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నులి పురుగుల సమస్యను నివారించడానికి పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. పిల్లలకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, ముఖ్యంగా ఆహారం తినడానికి ముందు మరియు టాయిలెట్ వాడిన తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించాలి. గోళ్ళు శుభ్రంగా కత్తిరించడం, శుభ్రమైన నీటిని తాగడం, మరియు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటివి అలవాటు చేయాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూడవచ్చు.
Read Also : Earthquake : రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం