Health Tips: హై బీపీ బాధితులకు రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా, అరేళ్లకు ఒక్కసారి తీసుకునే ప్రత్యేక ఇంజెక్షన్ చికిత్స త్వరలో అందుబాటులోకి రానుంది. siRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ ఇంజెక్షన్, రక్తపోటు పెరగడానికి కారణమయ్యే కాలేయంలోని కొన్ని ప్రోటీన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది.
Read Also: Water : నీటితో దీర్ఘకాలిక రోగాలకు చెక్..

ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల ప్రకారం, మందులు తరచూ మర్చిపోయే రోగులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు. అయితే, ఈ కొత్త చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అలాగే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.
భారత్లో ప్రస్తుతం 31 కోట్లకు పైగా ప్రజలు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఇంజెక్షన్ చికిత్స విజయవంతంగా అమలులోకి వస్తే, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: