हिन्दी | Epaper

Pesara Idli : పెసర ఇడ్లీ తయారీ విధానం

Sudha
Pesara Idli : పెసర ఇడ్లీ తయారీ విధానం

పెసర ఇడ్లీ (Pesara Idli) ఆరోగ్యానికి మేలైన, తేలికపాటి ఆహారం. పెసరపప్పుతో తయారయ్యే ఈ ఇడ్లీ (Pesara Idli) ప్రోటీన్లు (proteins)సమృద్ధిగా ఉంటాయి. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాతి ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి.

కావలసిన పదార్దాలు

పెసరపప్పు: పావు కిలో
బొంబాయి రవ్వ: 50 గ్రాములు
అల్లం: అంగుళం ముక్క
పెరుగు: ముప్పావు కప్పు
ఉప్పు: తగినంత
సోడా ఉప్పు: పావు స్పూను (లేదా) ఒక ఈనో పాకెట్‌

Pesara Idli  : పెసర ఇడ్లీ తయారీ విధానం
Pesara Idli : పెసర ఇడ్లీ తయారీ విధానం

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాతి ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. అందులో బొంబాయి రవ్వ కలపాలి. తర్వాత పెరుగు కూడా వేసి కలియబెట్టాలి. అల్లం ముక్కను సన్నగా తురిమి ఈ మిశ్రమానికి కలపాలి. ఇప్పుడు ఉప్పుతోపాటు సోడా ఉప్పు కానీ ఈనోసాల్ట్‌ కానీ వేసి బాగా కలపాలి. తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్లకు కాస్త నెయ్యి లేదా నూనె రాసి ఈ పిండిని వేసి, ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. కుక్కర్‌లోనూ నీళ్లు పోసి ఈ ప్లేట్లను పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. అయ్యాక తీసి, కొబ్బరి చట్నీతో వేడివేడిగా వడ్డిస్తే పెసర ఇడ్లీ (Pesara Idli) రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. లేత పచ్చ రంగులో ఉండే ఇది ఇడ్లీ వద్దనే పిల్లల్నీ రారమ్మంటూ ఊరించేస్తుంది.

భారతదేశంలో రవ్వను ఎవరు ప్రవేశపెట్టారు?

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ప్రొఫెషనల్ వంటవాడు అయిన శ్రీ యజ్ఞనారాయణ వివిధ పదార్థాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు మరియు చివరికి బియ్యానికి బదులుగా సెమోలినాతో ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించాడు మరియు ఆ విధంగా రవ్వ ఇడ్లీ రెసిపీ యొక్క అల్పాహార వస్తువును కనుగొన్నాడు.

ఇడ్లీని కనుగొన్నది ఎవరు?

ఆహార చరిత్రకారుడు కె.టి. అచాయ ప్రకారం, ఇండోనేషియాలోని హిందూ-బౌద్ధ రాజ్యాల రాజులు నియమించిన వంటవాళ్ళు ఇడ్లీ ఆవిష్కరణ వెనుక ఉన్న నాయకత్వాలు మరియు రెసిపీని తిరిగి తీసుకురావడానికి కారణమైన వారు అయి ఉండవచ్చు. ఇండోనేషియన్లు ఈ వంటకాన్ని ‘కెడ్లీ’ అని పిలుస్తారు. కాలక్రమేణా ఇది చాలా మందికి సౌకర్యవంతమైన ఆహారంగా మారింది.

ఇడ్లీ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?

తమిళనాడు మరియు కర్ణాటక రెండూ ఇడ్లీని కనుగొన్నామని చెప్పుకుంటున్నప్పటికీ, ప్రసిద్ధ ఆహార చరిత్రకారుడు కె.టి. అచాయ ఇడ్లీ బహుశా 800-1200 CE ప్రాంతంలో, ప్రస్తుత ఇండోనేషియా నుండి భారతదేశానికి వచ్చి ఉంటుందని సూచిస్తున్నారు. ఇడ్లీ గురించి వివిధ పురాతన భారతీయ గ్రంథాలలో వ్రాయబడింది.

Read hindi news :hindi.vaartha.com

Read Also:Cabbage mango chutney : క్యాబేజీ మామిడికాయ పచ్చడి ఎలా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870