Mylavaram Wedding Drama: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీ యువకులకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, బంధుమిత్రుల కోలాహలం మధ్య శుక్రవారం వరుడి నివాసంలో వేడుకగా పెళ్లి జరుగుతోంది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సీన్ రివర్స్ అయ్యింది.
Read Also: AP crime: రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు
‘వచ్చావా’ అంటూ మండపం దిగిన వధువు
ముహూర్తం సమయంలో వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. అదే సమయంలో ఓ యువకుడు హఠాత్తుగా మండపం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే వధువు పీటల మీద నుంచి లేచి “వచ్చావా” అంటూ అతడి వద్దకు వెళ్లింది. “ఇతను మా ఊరివాడే, మేమిద్దరం ప్రేమించుకున్నాం” అని అందరి ముందు ప్రకటించడంతో వరుడితో పాటు బంధువులంతా నిశ్చేష్టులయ్యారు.
ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన వరుడి తరఫు వారు ప్రియుడిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ కొడుకు పెళ్లి కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు చేశామని, తీరా చివరి నిమిషంలో ఇలా పరువు తీశారని వరుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరకు పెళ్లి ఆగిపోవడంతో శనివారం గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు పంచాయితీ నిర్వహించుకుని వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ప్రేమించిన వాడి కోసం వధువు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన ఈ ఘటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: