ఇన్స్టాలో ప్రేమ.. ఘోర హత్యకు దారితీసింది!
హర్యానాలోని హిస్సార్ జిల్లా ప్రేమ్నగర్ లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్న ఓ మహిళ.. తన ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసింది. పబ్లిక్ ఫేస్గా వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న రవీనా అనే యువతి, సురేశ్ అనే వ్యక్తితో సన్నిహితంగా జీవనం సాగించేది. మొదట ఆ పరిచయం సామాన్యంగా మొదలై, ప్రేమగా మారి చివరికి నేరానికి దారి తీసింది. సోషల్ మీడియా ఫేమ్ కోసం మొదలైన ఆ బంధం, ఓ వ్యక్తి ప్రాణం తీసేంత తీవ్రంగా మారిపోయింది.
సురేశ్ తో ప్రేమలో పడిన రవీనా.. భర్త అభ్యంతరాలతో విసుగు
రవీనా ఒక వివాహిత. ఆమెకు భర్త ప్రవీణ్ ఉన్నాడు. కుటుంబంతో జీవనం సాగించాల్సిన రవీనా, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తాపత్రయంతో ఇన్స్టాలో వీడియోలు చేస్తుండగా, అక్కడే సురేశ్తో పరిచయం ఏర్పడింది. అతను కూడా వీడియోలు చేసే వ్యక్తే. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 34 వేల మంది ఫాలోవర్లు ఉండగా, ఈ జంట కలిసి షార్ట్ వీడియోలు తీసి, యూట్యూబ్, ఇన్స్టా వంటి ప్లాట్ఫామ్లపై పోస్టు చేయసాగారు. ఈ వ్యవహారంపై భర్త ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరాయి పురుషుడితో అంత సన్నిహితంగా ఉండకూడదని హెచ్చరించాడు. కానీ రవీనా మాత్రం అతని మాటలను లెక్కచేయలేదు. ఈ వ్యవహారంపై తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి.
మానసికంగా తొలగించాలని నిర్ణయించిన భార్య.. దారుణ ఘటన
మార్చి 25న రాత్రి రవీనా, సురేశ్ తో ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలో, అనుకోకుండా ప్రవీణ్ ఇంటికి వచ్చాడు. భార్యను ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో చూసి ఘోరంగా గొడవ పడ్డాడు. అప్పటికే తన భర్త తీరుతో విసిగిపోయిన రవీనా, అతడిని పక్కన పెడితే మిగిలిన జీవితం సురేశ్తో కలిసి స్వేచ్ఛగా గడపవచ్చని అనుకుంది. వెంటనే సురేశ్తో కలిసి ప్రణాళిక రచించి భర్త మెడ చుట్టూ దుపట్టా బిగించి దారుణంగా హత్య చేశారు. తర్వాత ఇంట్లో మామూలుగా నటిస్తూ, ఎవరికీ విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
రాత్రి బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లి డ్రైనేజీలో పడేశారు
ఆ దారుణం జరిగిన అనంతరం అర్ధరాత్రి దాటాక ఇద్దరూ కలిసి ప్రవీణ్ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి గ్రామానికి బయట ఉన్న డ్రైనేజీలో పడేశారు. మిగతా వారంతా నిద్రపోతున్న సమయం కావడంతో ఎవరూ ఆ అనుమానాస్పద కదలికను గమనించలేదు. తర్వాత రవీనా ఇంట్లోనూ, పబ్లిక్ ఫ్లేస్లలోనూ చాలా సాధారణంగా నటిస్తూ కనిపించింది. కానీ ఆమె నటన ఎక్కువ రోజులు నిలవలేదు.
సీసీటీవీ ఫుటేజీతో అసలు విషయం బయటపడింది
ఒక వారం తర్వాత డ్రైనేజీలో ఒక మృతదేహం కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు రాత్రివేళ మృతదేహాన్ని డ్రైనేజీలో పడేస్తుండటం కనిపించింది. ఆ ఆధారాలతో పోలీసులు రవీనా, సురేశ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమ స్టైల్ లో విచారించగా, వారు చేసిన పాపాన్ని అంగీకరించారు. ప్రస్తుతం ఇద్దరూ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా ప్రపంచం వెనుక ఉన్న డార్క్ రియాలిటీని బయటపెట్టింది.
READ ALSO: Murder: వృద్ధురాలిని చంపి ఆపై పైశాచిక ఆనందాన్ని పొందిన బాలుడు