Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

వేసవి సెలవులు ప్రారంభమయ్యే వేళ పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు.ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.ఇప్పుడు తాజాగా మరో ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించారు అధికారులు.చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ వేసవి సీజన్ పొడవునా అంటే మే 31వ తేదీ వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం 16 రైలు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాలు అంటే- ఏప్రిల్ 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16,18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9: 35 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

Advertisements

ప్రత్యేక రైలు

తిరుగు ప్రయాణంలో ఈ నెల 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రతి ఆది, మంగళవారాలు అంటే- 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7: 10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఊందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

చర్లపల్లి

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యామ్నాయంగా చర్లపల్లిని కొత్త రైల్వే టర్మినల్‌గా అభివృద్ధి చేసింది. తొమ్మిది ప్లాట్ఫార్మ్‌లు, ఆధునిక వసతులతో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దారు. దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టర్మినల్ ఇప్పటికే పలు రెగ్యులర్, స్పెషల్ రైళ్లకు హబ్‌గా మారింది.ఈ నేపథ్యంలో చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ప్రకటించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hyderabad: శ్రీవారి భక్తులకు శుభవార్త! హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల సౌకర్యం

Related Posts
SLBC టన్నెల్లో రోబోలతో సెర్చ్ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

SLBC టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం గత 23 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సహాయక బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, Read more

ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ
Discussion on budget from today in AP

అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. Read more

Pastor John jebaraj: హత్యాచారం కేసులో పాస్టర్ జాన్ జెబరాజ్‌ అరెస్ట్
Pastor John jebaraj: హత్యాచారం కేసులో పాస్టర్ జాన్ జెబరాజ్‌ అరెస్ట్

భక్తి పేరుతో మైనర్లపై లైంగిక దాడి – జాన్ జెబరాజ్ అరెస్టు భక్తి పేరుతో మైనర్లను ఆక్రమించుకునే దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు చేసే అరాచకాలు కొనసాగుతూనే. Read more

“జై భవాని”, “జై శివాజీ” నినాదాలతో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభం..
modi 9

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలపై బీజేపీ కార్యాలయంలో తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన "జై భవాని" నినాదంతో ప్రసంగాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×