హైదరాబాద్ జీడిమెట్ల*Hyderabad Jeedimetla)లో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటనకు రాష్ట్రమంతా దిగ్భ్రాంతి చెందుతోంది. 15ఏళ్ల బాలిక తన ఇన్స్టాగ్రామ్(Istagram) ప్రియుడితో కలిసి కన్న తల్లిని పాశవికంగా హత్య చేయించింది. మానవ సంబంధాల పరిపక్వత లేకుండా ఉన్న వయసులో అమ్మ ప్రేమను పక్కన పెట్టి ప్రేమ జంట చేసిన పని నిస్సహాయతకు ఉదాహరణగా మారింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్లో లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆమె ప్రియుడి సోదరుడు ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు
తల్లిని మందలించిందని చంపేందుకు ప్రణాళిక
మహబూబాబాద్ జిల్లా(Mahabubnagar District)) ఇనగుర్తికి చెందిన సట్ల అంజలి(Anjali) (39) సాంస్కృతిక కళాకారిణి. మొదటి భర్త మృతిచెందడంతో రెండో పెళ్లి చేసుకున్న ఆమె, రెండో భర్త మరణానంతరం రెండు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. పెద్ద కుమార్తె ఓ డీజే యువకుడితో (శివ, 19) ఇన్స్టాలో పరిచయమై ప్రేమలో పడింది. తల్లి అంజలి దీనిని అంగీకరించకపోవడంతో, ఆమెను హత్య చేయాలని బాలిక నిర్ణయించుకుంది.
చాటింగ్లో ‘చంపేద్దామా’.. బెదిరింపుతో ఒప్పిన ప్రియుడు
తల్లిని చంపాలని బాలిక తన ప్రియుడికి చాటింగ్ ద్వారా తెలిపింది. తొలుత శివ నిరాకరించగా, ‘ఒప్పుకోకపోతే నేను చనిపోతా, నా మరణానికి నీవే కారణం’ అని బెదిరించింది. శివ కూడా మైనరైన తన సోదరుడితో కలిసి ఈ కుట్రకు ఒప్పుకున్నాడు.

హత్యా తంతు: చున్నీతో గొంతు నులిమి, మళ్ళీ వచ్చి ఖాతం
జూన్ 24న మధ్యాహ్నం సమయంలో బాలిక తల్లి ఇంట్లో ఉండగానే, శివ, అతడి సోదరుడు వచ్చారు. ఆమె వారిని లోపలికి పంపి తానే బయట కాపలా కాసింది. లోపల ఇద్దరు కలిసి అంజలి మెడకు చున్నీ బిగించి, తలపై గాయాలు చేసి అపస్మారక స్థితిలోకి నెట్టారు. బాలిక చెల్లెలు ఇంటికి వచ్చేసరికి ఆమెను తప్పించిచెప్పి పక్కింటికి పంపింది. తల్లి మరణించలేదని తెలిసి శివను మళ్ళీ ఫోన్లో పిలిచి “అమ్మ ఇంకా బతికే ఉంది.. వచ్చి చంపెయ్” అన్నది. ఇద్దరు తిరిగొచ్చి మరల చున్నీ బిగించి హత్య చేశారు.
ఆత్మహత్య డ్రామా: పోలీసుల పటిమతో అసలు నిజం వెలుగులోకి
తల్లి ఉరివేసుకుని చనిపోయిందంటూ నాటకం వేసిన బాలిక.. పోలీసుల ప్రశ్నలతో విరిగిపోయింది. విచారణలో ఆమె హత్యకు ప్రణాళిక తయారు చేసి, ప్రియుడి సహాయంతో మాతృహత్య చేసినట్లు ఒప్పుకుంది. జీడిమెట్ల పోలీసులు బాలికతో పాటు శివ, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వలయంలో పడిన బాలల మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులు, సమాజం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో బాలికను గట్టిగా ప్రశ్నించగా.. శివ, అతడి సోదరుడితో కలిసి తల్లిని హత్య చేయించినట్లు అంగీకరించిందని జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ చెప్పారు.
Read Also: Betting App: బెట్టింగ్ యాప్.. నలుగురు ఇన్ఫ్లూయెన్సర్లు అరెస్ట్ చేసిన పోలీసులు