హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏడాది నిర్వహించే ప్రసిద్ధమైన చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ తేదీలు ఖరారయ్యాయి. ఉబ్బసం (ఆస్తమా) సహా వివిధ శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందాలనే ఆశతో ప్రజలు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ చికిత్సకు తరలివచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు చేరతారు.
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
ఈ ఏడాది చేప ప్రసాదాన్ని జూన్ 8, 9 తేదీల్లో పంపిణీ చేయనున్నట్లు బత్తినీ సోదరులు (Bathini Brothers) తమ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాన్ని ఎప్పటిలాగే వేదికగా ఎంచుకున్నారు. ఈ రెండు రోజులూ అక్కడే ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. భద్రత, ఆరోగ్య ఏర్పాట్లు, మెడికల్ సౌకర్యాలపై అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ప్రజల కోసం విశేష ఏర్పాట్లు
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బత్తినీ కుటుంబ సభ్యులు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శిబిరాలను ఏర్పాటు చేయడం, నీటి సదుపాయాలు, వైద్య సాయం వంటి చర్యలను చేపడుతున్నారు. ఈ చేప ప్రసాదం ఆయుర్వేద మరియు కుటుంబ రహస్య పద్ధతిలో తయారవుతుందని, ఇది ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు.
Read Also : MP Damodar : ఎమ్మెల్సీ కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ