ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేస్తుందో ఏడాదిలోనే చూపించాం” అన్నారు. అమరావతిలో (In Amaravati) జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఊహించిన దానికంటే ఎక్కువగా పనిచేశామని పేర్కొన్నారు.చంద్రబాబు గత వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. వారి వైఫల్యంతో రాష్ట్ర అభివృద్ధి తారుమారైంది అని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రానికి తీవ్ర నష్టం తీసుకొచ్చిందన్నారు. ఇది ముక్కలాట మాత్రమే కాదు, భవిష్యత్తుకే ప్రమాదం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు
అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 213 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభించామని, వన్ టు ఇంటర్ వరకు అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటించారు.
శాంతిభద్రతలు – గంజాయి నిర్మూలన
రాయలసీమలో ముఠాల పోరాటాలను నిలిపేశామని, గంజాయి సాగును అరికట్టామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతిని మళ్లీ నిర్మాణ మార్గంలో పెట్టామని, మూడేళ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టుకు ₹12,500 కోట్లు కేటాయించామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 31 పారిశ్రామిక విధానాలు తీసుకువచ్చామని తెలిపారు.
స్వర్ణాంధ్ర లక్ష్యం 2047 – స్పష్టమైన దిశ
ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం ₹2.6 లక్షలు అని, 2047 నాటికి దీన్ని ₹55 లక్షలకు తీసుకెళ్లాలన్నదే తమ దృష్టి అని చెప్పారు. పీ–4 మోడల్ (ప్రజలు–ప్రైవేట్–ప్రభుత్వం భాగస్వామ్యం) ద్వారా లక్ష్య సాధన సాధ్యమవుతుందని తెలిపారు.
Read Also : Headingley Test : హెడింగ్లేలో పంత్ తొలి భారతీయుడిగా రికార్డు..