టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కొంత విరామంలో ఉన్నాడు, కానీ ఆయనపై ఉన్న అభిమానంతో 15 ఏళ్ల అభిమాని రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఎమోషనల్ లేఖలో “మీ ఫామ్ తాత్కాలికం, క్లాస్ పర్మనెంట్” అని రోహిత్పై విశ్వాసం, ప్రేమను వ్యక్తం చేశారు. ఈ లేఖ రోహిత్కు మాత్రమే కాకుండా, క్రికెట్ అభిమానులను కూడా స్ఫూర్తినిచ్చింది.రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా టెస్టులు, వన్డే ఫార్మాట్లలో సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు నిరాశ అనుభవించింది.
ఆ సమయంలో, రోహిత్ కూడా ఫామ్ కోసం కష్టపడుతున్నాడు. రంజీ మ్యాచ్లో కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో, ఓ అభిమాని రాసిన లేఖ అతన్ని స్ఫూర్తి ఇచ్చేలా మారింది.ఈ అభిమాని రోహిత్కు ఎమోషనల్ లేఖ రాసి, తన అభిమానాన్ని అద్భుతంగా వ్యక్తం చేశాడు. “మీరు గ్రేటెస్ట్ బ్యాటర్ ఆఫ్ ఆల్ టైమ్. ఫామ్ కేవలం తాత్కాలికం, కానీ మీ క్లాస్ ఎప్పటికీ ఉంటుంది. మీ ఆటను చూస్తూ పెరిగిన నేను చాలా అదృష్టవంతుడిని. రంజీ మ్యాచ్లో మీరు కొట్టిన మూడు సిక్సర్లు అద్భుతం. మీరు దశాబ్దాలుగా క్రీడాభిమాని గా నేర్చుకున్న విషయాలు అందించినందుకు, మీకు రుణపడి ఉంటాను.”అతడు, రోహిత్ యొక్క నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, “మీరు అన్ని ఫార్మాట్లలో విజయం సాధించిన అరుదైన కెప్టెన్.
మీరు రిటైర్ కాకుండా ఆడాలని నా ఆకాంక్ష.మీరు మైదానంలో ఉండకపోతే, నేను టీవీ ఆన్ చేయగలనా అనే ఆలోచనే నాకు బాధిస్తుంది.”ఈ లేఖలో యువ అభిమాని, క్రికెట్తో పాటు తన భవిష్యత్తు గురించి కూడా చెప్పాడు. “నేను 15 ఏళ్ల వయస్సులో ఉన్నాను, స్పోర్ట్స్ అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. రాజస్థాన్ రాయల్స్తో ఇంటర్న్షిప్ చేసిన అనుభవం చాలా గొప్పది.”ఈ లేఖ రోహిత్ శర్మకు మంచి ప్రేరణగా మారింది. తనకు ఉన్న విశ్వాసాన్ని, ప్రేమను అభిమాని వ్యక్తం చేశాడు , రోహిత్ తన ఫామ్ను తిరిగి పొందగలిగే ఆశను కలిగించాడు.రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.