Maoist : మరోసారి ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరి తలలపై రూ.13లక్షల రికార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొండగావ్-నారాయణ్పుర్ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.

ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మావోయిస్టు అగ్ర నేత, కమాండర్ హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రామి అని గుర్తించారు. హల్దార్పై రూ.8లక్షలు, రామిపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్రాజ్ వెల్లడించారు. తాజా ఎన్కౌంటర్తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందారు. వీరిలో ఒక్క బస్తర్ డివిజన్లోనే 123 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: అమర్నాథ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం