हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Electric Buses: తెలంగాణకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు

Anusha
Electric Buses: తెలంగాణకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ, ఇంధన వ్యయాన్ని తగ్గించడానికి  ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తోంది.ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వ ‘ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్’ పథకం కింద రాష్ట్రానికి కొత్త బస్సులు మంజూరయ్యాయి. గతేడాది 2,800 బస్సుల కోసం ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేయగా ఈ నెల 22న 2,000 బస్సులను మంజూరు చేసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ త్వరలో బస్సుల సరఫరాకు టెండర్లు పిలవనుంది. టెండర్ దక్కించుకున్న ప్రైవేటు సంస్థ ‘వెట్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)’ విధానంలో బస్సుల తయారీ, డ్రైవర్, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. దీనికి ఆర్టీసీ కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాలి. ప్రస్తుతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు కి.మీ.కి రూ.57 చొప్పున చెల్లిస్తోంది.అయితే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై కార్మిక సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ అద్దె బస్సులకు సైతం ఆర్టీసీ డ్రైవర్లే(RTC Drivers) ఉండాలని అధికారులు ‘డ్రై జీసీసీ’ విధానాన్ని ప్రతిపాదించారు. కేంద్రం మాత్రం ఈ విధానం ఇప్పుడు కుదరదని, ప్రైవేటు డ్రైవర్లే ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి లిఖితపూర్వకంగా వచ్చాక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కేంద్రం

పాత డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజిన్ అమర్చే రెట్రోఫిటింగ్ ప్రతిపాదనను ఆర్టీసీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి ఒక్కో బస్సుకు రూ.50- 60 లక్షలు ఖర్చవుతుంది. అయితే, ఈ తరహాకు సబ్సిడీ ఇచ్చే విధానం ప్రస్తుతం తమ వద్ద అమలులో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకునే బదులు ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ టెండర్ ద్వారా కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేస్తే తయారీ సంస్థలు సకాలంలో సరఫరా చేయలేవని కేంద్రం ఆర్డర్ ఇచ్చిన 14 వేల బస్సుల తయారీకే ప్రాధాన్యమిస్తాయనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో ఉంది.

Electric Buses: తెలంగాణకు  రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు
Electric Buses: తెలంగాణకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు

అదనపు

తెలంగాణకు అదనంగా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy)ని కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయిన సందర్భంగా హైదరాబాద్‌ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హైబ్రిడ్ జీసీసీ మోడల్ (ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లతో నిర్వహణ)ను పరిశీలించాలని, ప్రస్తుతం డీజిల్ బస్సులకు రెట్రోఫిట్మెంట్ అవకాశం కల్పించాలని సీఎం కోరారు. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఒక డీజిల్ బస్సుకు రెట్రోఫిటింగ్ చేసి విజయవంతంగా నడుపుతోంది.

Read Also : TG ECET Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రామ్ వంజీ సుతార్ మృతి.. కేసీఆర్ సంతాపం

రామ్ వంజీ సుతార్ మృతి.. కేసీఆర్ సంతాపం

గర్భిణి మృతదేహంపై మూఢనమ్మకాల అమానుష ఘటన

గర్భిణి మృతదేహంపై మూఢనమ్మకాల అమానుష ఘటన

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

📢 For Advertisement Booking: 98481 12870