Election expenses will be saved with Jamili elections.. Venkaiah Naidu

Venkaiah Naidu : జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు ఆదా : వెంకయ్య నాయుడు

Venkaiah Naidu : తిరుపతిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని అన్నారు. సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు జరపడం కష్టం కాదని చెప్పారు. కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు.

Advertisements
జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు

అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి

జమిలి ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు. వారు ఎవరో మీకే తెలుసు అంటూ వెంకయ్య నాయుడు సెటైర్లు వేశారు.

భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది

అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని అన్నారు. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందుతునరాని అన్నారు. నువ్వే నా.. మేం అంతే అంటూ మరికొద్దిమంది భూతులు మాట్లాడుతున్నార‌ని వాపోయారు. పోలింగ్ భూత్‌లోకి వెళ్లి ఓటు వేసి ఓడించార‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.

Read Also: త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ?

Related Posts
రేవంత్‌ రెడ్డికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు: కేటీఆర్
రేవంత్ రెడ్డికి ఆర్ ఎస్ ఎస్ తో సంబంధాలు కేటీఆర్

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని, Read more

నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం
Congress LP meeting chaired by CM Revanth Reddy today

హైదరాబాద్‌: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. అసెంబ్లీ కమిటీ Read more

Mad Square : మ్యాడ్ స్క్వేర్ ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా?
మ్యాడ్ స్క్వేర్ ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా?

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా, ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది. సినిమా విడుదలైన Read more

స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రధాని మోడీ
Prime Minister Modi participated in the cleanliness drive

Prime Minister Modi participated in the cleanliness drive న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చీపురు ప‌ట్టి ఆయ‌న చెత్త‌ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×