ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు

free bus :ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు

ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.

ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు

జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం
ఉచిత బస్సు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా ఆరు కీలక హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లతో పాటుగా.. బడ్జెట్ లో మరో రెండు పథకాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు.
ముగ్గురు మంత్రులతో కమిటీ
పథకం అమలు పై ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆర్టీసీ పై భారం మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు.

Related Posts
పోసాని రిమాండ్ రిపోర్టులో ఏముందంటే !
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

పోసాని రిమాండ్ రిపోర్టు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును Read more

ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?
AP Inter Calss

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించేందుకు అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఇందులో విద్యార్థులకు అవసరమైన అన్ని వివరాలను పొందుపరిచారు. కొత్త Read more

టీవీ-5 అధినేత బీఆర్‌ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ పదవి;
TTD

23 మంది సభ్యులతో కూడిన టీటీడీ బోర్డు ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు Read more

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు..!
Another case against YCP MLC Duvvada..!

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు నమోదు అయింది. గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో దువ్వాడపై ఫిర్యాదు చేశారు మాణిక్యాల రావు. డిప్యూటీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *