ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు

free bus :ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు

ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.

ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణంపైన కసరత్తు

జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం
ఉచిత బస్సు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా ఆరు కీలక హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లతో పాటుగా.. బడ్జెట్ లో మరో రెండు పథకాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు.
ముగ్గురు మంత్రులతో కమిటీ
పథకం అమలు పై ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆర్టీసీ పై భారం మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు.

Related Posts
రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ విజయమ్మ మరో లేఖ
Another letter of YS Vijayamma to the people of the state

అమరావతి : కర్నూలులో కొన్ని రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలపై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు ఆమె Read more

ఏపీలో వాలంటీర్లు వద్దే వద్దు – నిరుద్యోగ జేఏసీ
ap volunteer

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై నిరుద్యోగ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను ఉపయోగించి Read more

పెరుగుతున్న సైబర్ నేరాలపై డీజీపీ ఆందోళన
DGP Dwaraka Tirumala Rao

దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు దేశవ్యాప్త ట్రెండ్‌కు అద్దం పడుతుండడంపై ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) ద్వారకా తిరుమలరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర Read more

వచ్చే నెలలోనే ఏపీ రాష్ట్ర బడ్జెట్..?
ap budget 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ను సాధారణ షెడ్యూల్ కంటే ఒక నెల ముందుగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది మార్చి నెలలో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *