ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎస్సీ నోటిఫికేషన్ను మార్చి నెలలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం ఐదవ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు డీఎస్సీ నోటిఫికేషన్ గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు.
డీఎస్సీ ప్రక్రియకు అడ్డంకులు లేవు
డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఉదయం ఐదవ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు.
వన్ మ్యాన్ కమిషన్
టీడీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. వర్గీకరణపై త్వరలోనే వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వనుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.

నిరుద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటన ఊరట కలిగించే అంశంగా మారింది. గత కొన్నేళ్లుగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో, వేలాది మంది అభ్యర్థులు తమ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని లోకేష్ ప్రకటన చేయడంతో అభ్యర్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ మార్చి నెలలో ఖచ్చితంగా విడుదలగత టీడీపీ హయాంలో 70% ఉపాధ్యాయ నియామకాలు జరిగాయివైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని విమర్శలువన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే విడుదలఅభ్యర్థులకు డీఎస్సీపై త్వరలోనే పూర్తి సమాచారం.