బాలీవుడ్లోని ఫేవరేట్ జంటగా రణ్బీర్ కపూర్, అలియా భట్దే ప్రత్యేక స్థానం.2022లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది నవంబరు 6న వారికి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఆమెకు ‘రాహా’ అని నామకరణం చేశారు. అయితే ఈ స్టార్ కిడ్ ఏడాది వయసులోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పిల్లల కంటే రిచ్ అయిపోయిందట.
గోప్యతకు భంగం
రాహా ఫొటోలను తీయొద్దని మీడియా, ఫొటోగ్రాఫర్లుకు అలియా భట్ ఇటీవలే విజ్ఞప్తి చేశారు. “మా ఇంట్లోకి దుండగులు చొరబడి రాహాను నాకు దూరంగా తీసుకువెళ్లిపోతున్నట్లు ఓసారి కల వచ్చింది. అంతకంటే దారుణమైన కల మరొకటి లేదు. అందుకే పాప సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించుకున్నాను. తన గోప్యతకు భంగం కలగకుండా ఉండేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి, మా అభ్యర్థనను అర్థం చేసుకోండి. మా అనుమతి లేకుండా రాహా ఫొటోలు తీయొద్దు. ఒకవేళ ఎప్పుడైనా మాతోపాటు పాప ఫొటోలను తీస్తే తన మొహం కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సరైన సమయం వచ్చాక ఆమెను తప్పకుండా మేమే మీ అందరి ముందుకు తీసుకువస్తాం. నా బిడ్డ శ్రేయస్సు కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇది ఒక ప్రత్యేక సమస్యగా మీకు అనిపించవచ్చు. కానీ తల్లిదండ్రులుగా మా బిడ్డను రక్షించుకోవడానికి మేము వీలైనంతంగా ప్రయత్నిస్తాం” అని అలియా భట్ వ్యాఖ్యానించారు.రాహా పేరిట రణ్బీర్ కపూర్, అలియా భట్ ఇంత ఖరీదైన ఇల్లును రిజిస్టర్ చేయించారట.ముంబయిలోని బాంద్రాలో రూ.250 కోట్ల బంగ్లాకు రాహా యజమాని అని తెలుస్తోంది.ఈ బంగ్లా ఖరీదు షారుక్ ఖాన్ నివాసం- మన్నత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇల్లు- జల్సా కన్నా ఎక్కువని టాక్. దీంతో షారుక్ ఖాన్ పిల్లలు ఆర్యన్, అబ్రామ్, సుహానాల కన్నా రాహానే రిచ్ అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియా
ఆలియా భట్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంది. ముఖ్యంగా తన ముద్దుల కూతురు రాహా కపూర్ ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాయి. ఇవి క్షణాల్లోనే తెగ వైరలవుతుంటాయి. అలియా స్వయంగా తన కూతురి ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆలియా ఉన్నట్లుండి తన కూతురి ఫోటోలన్నింటినీ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది. రణ్బీర్’యానియల్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రణ్బీర్ మాస్ యాక్షన్కు నార్త్ ఇండియా ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం బ్రహ్మాస్త-2, రామాయణ్ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ‘ఆల్ఫా’ అనే సినిమాతో అలియా భట్ బిజీగా ఉన్నారు.
Read Also: NTR: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా:ఎన్టీఆర్