అమెరికా దిగ్గజ ఫాస్ట్ ఫుడ్(Fast food) సంస్థ యమ్ బ్రాండ్ ఇంక్కు మన దేశంలో ఉన్న రెండు అతిపెద్ద ఫ్రాంఛైజీ భాగస్వాములు దేవయానీ ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ ఇండియా (Fast food) విలీనానికి చర్చలు జరుగుతున్నాయి. కేఎఫ్సీ, పిజ్జా హట్, టాకో బెల్ వంటి బ్రాండ్లు యమ్ బ్రాండ్ చేతిలో ఉన్నాయి. మందకొడిగా ఉన్న వృద్ధిని ఎదుర్కునేందుకు భారత్లో కార్యకలాపాలను ఏకీకరణ చేయాలన్నది యమ్ బ్రాండ్ (Yum Brand)ప్రతిపాదనగా పేర్కొన్నాయి.
విలీనం ఎలా ఉంటుందంటే?
సఫైర్ వాటాదార్లు తమ ప్రతి 3 షేర్లకు ఒక దేవయానీ షేరును పొందుతారు. సఫైర్కు చెందిన కేఎఫ్సీ, పిజ్జా హట్ ఫ్రాంఛైజీ హక్కులను దేవయానీ (Devyani) కొనుగోలు చేస్తుంది. తద్వారా యమ్ భారత కార్యకలాపాలు ఈ సంస్థ కిందకు వస్తాయి.
రవి జయ్పురియా కు చెందిన సంస్థ
భారత కుబేరుడు రవి జయ్పురియాకు చెందిన ఆర్జే గ్రూప్లో భాగమైన దేవయానీ ఇంటర్నేషనల్, ప్రస్తుతం భారత్, నేపాల్, నైజీరియా, థాయ్లాండ్ల్లో 2,030 విక్రయశాలలను నిర్వహిస్తోంది. సునీల్ చందరమణి నేతృత్వంలోని సఫైర్

ఫుడ్స్ ఇండియా(Fast food) కు భారత్, శ్రీలంకల్లో 963 రెస్టారెంట్లు ఉన్నాయి. సఫైర్ మార్కెట్ విలువ రూ.10,313 కోట్లు కాగా.. దేవయానీ మార్కెట్ విలువ రూ.19,935 కోట్లుగా ఉంది. అంటే ఈ రెండు సంస్థల మార్కెట్ విలువ కలిపి రూ.30,000 కోట్ల పైనే.
విలీనం వెనుక ఉద్దేశం
భారత మార్కెట్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో, కార్యకలాపాల ఏకీకరణ ద్వారా సమర్థవంతంగా వృద్ధిని సాధించాలని యమ్ బ్రాండ్స్ యోచన. వ్యవస్థీకృత ఫ్రాంచైజీ నిర్మాణం కోసం ఈ విలీన ప్రతిపాదన.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్