మహాశివరాత్రి(Shivaratri) రోజున శివభక్తులు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటిస్తే పూజ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Read Also:Mahashivaratri:ఉపవాసంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు

శివాలయం నుంచి ఖాళీ చేతులతో ఇంటికి రావద్దని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ప్రసాదం లేదా తీర్థం తప్పకుండా తీసుకురావాలి. అలాగే ఇంటికి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు కడుక్కోకుండా కొంతసేపు భక్తిభావంతో ఉండడం మంచిదని అంటారు.
ప్రసాదాన్ని దారిలోనే తినకుండా ఇంట్లో శుభ్రమైన(Shivaratri) ప్రదేశంలో ఉంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించాలి. ఈ రోజున గొడవలు, కోపం, నెగెటివ్ ఆలోచనలు దూరంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అదేవిధంగా గుడి నుంచి వచ్చిన వెంటనే నిద్రపోకుండా కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా శివనామ స్మరణ చేయడం మంచిదని నమ్మకం. ఈ చిన్న నియమాలు పాటిస్తే మహాశివరాత్రి పూజకు పూర్తి ఫలితం లభిస్తుందని విశ్వాసం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: