బ్రహ్మోత్సవాల(Brahmotsavalu) మూడో రోజు సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 32,870 మందికిపైగా భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. వీరిలో 14,280 మంది భక్తులు కాలినడకన పాదయాత్రగా ఆలయానికి చేరుకోవడం విశేషం.
Read Also: Wealth Tips: ఆర్థిక శుభఫలితాల కోసం తాబేలు ఉంగరం

అలాగే 12,931 మంది శివస్వాములు(Brahmotsavalu) స్పర్శ దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో స్వామివారి దర్శనానికి సగటున 4 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అదనపు కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు చేపట్టామని అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో తాగునీరు, వైద్య సేవలు, అన్నదానం వంటి సౌకర్యాలను కూడా విస్తరించినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: