हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Kumbh Mela : కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్ – అఖిలేశ్ యాదవ్

Sudheer
Kumbh Mela : కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్ – అఖిలేశ్ యాదవ్

ప్రయాగ్రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దాదాపు 1,000 మంది భక్తులు మిస్సయ్యారని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. కానీ భక్తుల గల్లంతు విషయంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

ఇప్పటికీ పోస్టర్లు – కుటుంబాల ఆవేదన

కుంభమేళా ముగిసిన చాలా రోజులైనా ఇప్పటికీ ఆ ప్రాంతంలో గల్లంతైన వారి పోస్టర్లు కనిపిస్తూనే ఉన్నాయని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. భక్తుల కుటుంబాలు తమ మిస్సయిన బంధువులను వెతుక్కునే ప్రయత్నంలో మిగిలిపోయారని తెలిపారు. వారిని క్షేమంగా ఇంటికి చేరవేయడానికి ప్రభుత్వం సమర్థంగా పనిచేయలేకపోతుందని విమర్శించారు.

akilesh
akilesh

ప్రభుత్వాల నిర్వాకంపై ఆరోపణలు

యూపీ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కుంభమేళా ఏర్పాట్లలో కేవలం వాహన పార్కింగ్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాయని, భక్తుల రక్షణ మరియు మౌలిక సదుపాయాలపై మాత్రం తగిన శ్రద్ధ తీసుకోలేదని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. భక్తుల అదృశ్యం నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

కేంద్రం ఖర్చు వివరాలు బయటపెట్టాలని డిమాండ్

కుంభమేళా ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించిందో ప్రజలకు తెలియజేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నిధులు వచ్చినా వాటిని సమర్థంగా ఉపయోగించలేదని విమర్శించారు. మిస్సయిన భక్తుల జాడ కనుగొని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870