हिन्दी | Epaper

Kumbh Mela : కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్ – అఖిలేశ్ యాదవ్

Sudheer
Kumbh Mela : కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్ – అఖిలేశ్ యాదవ్

ప్రయాగ్రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దాదాపు 1,000 మంది భక్తులు మిస్సయ్యారని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. కానీ భక్తుల గల్లంతు విషయంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

ఇప్పటికీ పోస్టర్లు – కుటుంబాల ఆవేదన

కుంభమేళా ముగిసిన చాలా రోజులైనా ఇప్పటికీ ఆ ప్రాంతంలో గల్లంతైన వారి పోస్టర్లు కనిపిస్తూనే ఉన్నాయని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. భక్తుల కుటుంబాలు తమ మిస్సయిన బంధువులను వెతుక్కునే ప్రయత్నంలో మిగిలిపోయారని తెలిపారు. వారిని క్షేమంగా ఇంటికి చేరవేయడానికి ప్రభుత్వం సమర్థంగా పనిచేయలేకపోతుందని విమర్శించారు.

akilesh
akilesh

ప్రభుత్వాల నిర్వాకంపై ఆరోపణలు

యూపీ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కుంభమేళా ఏర్పాట్లలో కేవలం వాహన పార్కింగ్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాయని, భక్తుల రక్షణ మరియు మౌలిక సదుపాయాలపై మాత్రం తగిన శ్రద్ధ తీసుకోలేదని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. భక్తుల అదృశ్యం నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

కేంద్రం ఖర్చు వివరాలు బయటపెట్టాలని డిమాండ్

కుంభమేళా ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించిందో ప్రజలకు తెలియజేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నిధులు వచ్చినా వాటిని సమర్థంగా ఉపయోగించలేదని విమర్శించారు. మిస్సయిన భక్తుల జాడ కనుగొని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’

శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఆన్‌లైన్‌లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం!

ఆన్‌లైన్‌లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం!

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

📢 For Advertisement Booking: 98481 12870