- ఎవరికెంత చేరిందో తేలనున్న లెక్కలు
TTD: తిరుమల వెంకన్న లడ్డూల తయారీలో కల్తీనెయ్యి సరఫరా జరిగిన తీరు, టెండర్లు దక్కించుకున్న విధానం తదితర అంశాలు, దాని వెనుక నడిచిన పెద్ద స్కామ్ లోతుగా తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో అంతిమంగా భారీగా కోట్ల రూపాయలు లబ్ధి పొందిన సూత్రధారులు, పెద్దలను తేల్చేందుకు ఇడికి ఆదేశించింది. కల్తీనెయ్యి కేసులో తొలినుండి టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు పాల్గొనడం, తదుపరి నిబంధనలు ఉల్లంఘించి నెయ్యి సరఫరా చేయడం వంటి అంశాల్లో భారీగా ఆర్థిక లావాదేవీలు నడిచాయనేటి సిబిఐ సిట్ అధికారులు ఆధారాలు రాబట్టారు. ఈ నివేదికలను సుప్రీంకోర్టుకు అందజేయడంతో ఇప్పుడు ఇడి రంగంలోకి దిగింది.
Read also: R. D. Wilson Sarath Chandra: తెలుగు అకాడమీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

ED probe into ‘adulterated oil’ scandal continues
TTD: 2019-2024 మధ్యకాలంలో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ చేసి సరఫరా చేశారనేది, ఇందులో 235 కోట్లు రూపాయలు అంచనాగా ఉండగా 36మందిని నిందితులుగా సిట్ తేల్చింది. వీరిలో 12మంది టిటిడి మార్కెటింగ్, కొనుగోళ్ళకమిటీ అధికారులే ఉండటం విశేషం. ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి ఇడి నోటీసులు జారీ చేసి ఆ దిశగా దర్యాప్తు, విచారణ చేపట్టేందుకు సమయం దగ్గరపడింది. ఇప్పటికే లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరా చేసిన పాపానికి కారకులను గుర్తించిన సిబిఐ సిట్ అధికారులు పూర్తిస్థాయిలో లోతుగా దర్యాప్తుచేపట్టి నివేదికలు అందించారు. 250కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఈ కేసులో ఇప్పుడు ఇడి సమగ్రంగా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను బయటకు తీసుకురానుందనే సంచలనం కలిగిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: