हिन्दी | Epaper

BettingApps : ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎందుకంటే!

Anusha
BettingApps : ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎందుకంటే!

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు పంపించి, ఈరోజు సాయంత్రం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసులో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరం

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు, యూట్యూబర్లు, సినిమా, టీవీ రంగాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత యాప్‌లను ప్రోత్సహించడం ద్వారా యువతను చెడుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో, దీనిపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా మరికొంతమందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ప్రముఖులకు నోటీసులు

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోటు చేస్తున్న టీవీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా మంది పోలీసులు సోమవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ విష్ణుప్రియ, యూట్యూబర్‌, కమెడియన్‌ టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. విచారణ తర్వాత మరికొందరికి సైతం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇన్‌‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్‌, టీవీ నటుల్లో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్‌ లింక్స్‌ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే గట్టి నిబంధనలు విధించింది. ఇలాంటి యాప్‌ల వల్ల ప్రజలు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా యువత ఈ వలలో చిక్కకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది.ఈ కేసులో మరికొంతమంది ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉందని, విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసి ప్రజలను మోసగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870