దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ కేసు తాజాగా మరోసారి వార్తల్లో ఉంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. మొత్తం ఒకేసారి 9 ప్రాంతాల్లో ఈడీ తన ఆఫీసర్లతో కలిసి సోదాలు నిర్వహించి, కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల ద్వారా నకిలీ సరోగసీ వ్యాపారం నడుస్తున్నట్లు స్పష్టమైన నిర్ధారణ లభించింది.
Balmoor Venkat-నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం తగదు:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
నకిలీ సరోగసీ వ్యాపారం విస్తృతంగా సాగిందని
ఫేక్ సరోగసీ ద్వారా వచ్చిన డబ్బును పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంలో వినియోగించారని స్పష్టమైన ఆధారాలు దొరికాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నమ్రత అనే మహిళ చేతిలో మోసపోయిన బాధితుల వివరాలను సేకరించినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా నకిలీ సరోగసీ క్లినిక్ (Fake surrogacy clinic) లు నడుపుతూ అనేక కుటుంబాలను మోసం చేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

విదేశీ దంపతులను కూడా ఈ ఫేక్ సరోగసీ మాయాజాలంలోకి లాగారని ఈడీ వెల్లడించింది. తమకు అప్పగించిన శిశువు తమ బిడ్డ కాదని ఆ దంపతులు డీఎన్ఏ టెస్ట్ (DNA test) ద్వారా గ్రహించారని అధికారులు తెలిపారు. ఈడీ సేకరించిన ఆధారాల ప్రకారం.. ఈ నకిలీ సరోగసీ వ్యాపారం విస్తృతంగా సాగిందని, అనేక మంది దంపతుల కలలను కూలదోసేలా ఉందని తేలింది. కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేస్తూ, ఈ మోసగాళ్లకు చెందిన ఆస్తులను సీజ్ చేయడం, నకిలీ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేయడంపై ఈడీ దృష్టి సారించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: